యాంకర్ ప్రదీప్ మరో వివాదంలో చిక్కుకున్నాడు.టీవీ ఆన్ చేస్తే ఏదో ఒక షోలో కనిపించి తన యాంకరింగ్ తో అలరించే ప్రదీప్ అప్పుడప్పుడు వివాదాల్లో కూడా చిక్కుకుంటాడు.
లేటెస్ట్ గా ఓ షోలో భాగంగా ఏపీ రాజధాని వైజాగ్ అనేసి ఏపీ ప్రజలకు కోపం వచ్చేలా చేశాడు.దీనిపై ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు సీరియస్ అవుతున్నారు.
కోర్ట్ లో ఉన్న అంశాల గురించి షోలో ఇలా మాట్లాడటం ఏమాత్రం కరెక్ట్ కాదని అంటున్నారు.యాంకర్ ప్రదీప్ వెంటనే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పాలని కోరుతున్నారు ఏపీ పరిరక్షణ సమితి.
ఒకవేళ అలా చేయకుంటే హైదరాబాద్ లో ప్రదీప్ ఇంటిని ముట్టడిస్తామని కూడా చెబుతున్నారు ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు.
ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను అన్నట్టుగా అయ్యింది ప్రదీప్ పరిస్థితి.
ఈమధ్యనే కరోనా వల్ల తన తండ్రిని కోల్పోయిన ప్రదీప్ తెలియకుండానే ఈ ఇష్యూలో చిక్కుకున్నాడు.ఏపీ పరిరక్షణ సమితి సభ్యులు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు.
అయితే ప్రదీప్ వీరి సారీ చెప్పి వివాదానికి ఫుల్ స్టాప్ పెడతాడో లేదో చూడాలి.ఈ వివాదంపై ప్రదీప్ స్పందన గురించి అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.