టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి 152 వ సినిమా గా ‘ఆచార్య’ తెరకెక్కుతుంది.ఈ సినిమాను కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కి స్తున్నాడు.ఈ సినిమాలో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.‘సిద్ద‘ అనే పవర్ ఫుల్ రోల్ లో రామ్ చరణ్ కనిపిస్తున్నారు.ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కనిపిస్తుంటే.రామ్ చరణ్ కు జోడీగా పూజ హెగ్డే నటిస్తుంది.
రామ్ చరణ్, పూజ హెగ్డే సినిమాలో కొద్దీ సేపే కనిపించ బోతున్నప్పటికీ వీళ్ళ పాత్రలు సినిమాకే హైలెట్ గా ఉండబోతున్నాయని సమాచారం.దాదాపు ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతున్న కారణంగా ఈ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే టాలీవుడ్ లో కొన్ని సినిమాలు కరోనా జాగ్రత్తలు పాటిస్తూ షూటింగ్ రీస్టార్ట్ చేసారు.ఆచార్య సినిమా కూడా త్వరలోనే రీస్టార్ట్ చేయబోతున్నారు.ఈ సినిమా మే 13 న విడుదల అవ్వబోతుందని ప్రకటించినప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడింది.అందుకే మిగిలిన భాగాన్ని తొందరగా పూర్తి చేసి చిరంజీవి పుట్టిన రోజుకు విడుదల చేయాలనీ కొరటాల శివ అనుకుంటున్నాడట.
అయితే తాజాగా ఈ సినిమాలో నటించే సీనియర్ హీరోయిన్ సంగీత గురించి ఒక వార్త మీడియాలో వైరల్ అవుతుంది.ఈమె పాత్రపై తాజాగా ఒక వార్త వినిపిస్తుంది.ఈమె ఒక నర్తకి పాత్రలో కనిపించబోతుందని టాక్.అంతేకాదు వెరీ ఎమోషనల్ గా సాగే సంగీత పాత్ర ఇంటర్వెల్ లో చనిపోతుందని అప్పుడే చరణ్ ఎంట్రీ కూడా ఉంటుందని తాజాగా వినిపిస్తున్న టాక్.
చూడాలి మరి ఈ సినిమా ఎంత మేరకు ఆకట్టుకుంటుందో.