దేశంలో కరోనా సృష్టించిన కలకలం అంతా ఇంతా కాదు.రెండోసారి వచ్చిన మహమ్మారి దేశంలో చాలా మందిని బలి తీసుకోవడం జరిగింది.
కరోనా సెకండ్ వేవ్ కారణంగా.సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ అనేకమంది ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
అయితే ఈ మహమ్మారిని ఎదుర్కోవాలంటే కచ్చితంగా వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని వైద్య నిపుణులు తెలపటంతోప్రభుత్వాలు వ్యాక్సినేషన్ పంపిణీ కార్యక్రమం శరవేగం చేయటానికి రకరకాలుగా కృషి చేస్తూ ఉన్నాయి.
ఇదిలా ఉంటే గతంలో ప్రధాని మోడీ దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ ఉచితంగానే పౌరులకు అందించడానికి.
ప్రభుత్వం సన్నద్ధం అయిందని తెలపడం జరిగింది.ఇటువంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు ఏమీ చెల్లించనవసరం లేదని తెలిపారు.
దీంతో నేటి నుండి దేశవ్యాప్తంగా ప్రధాని మోడీ ప్రకటించిన ఫ్రీ వ్యాక్సినేషన్ నేటి నుండి అమలులోకి రానుంది.ఈరోజు యోగ డే సందర్భంగా దేశవ్యాప్తంగా కనీసం యాభై లక్షల మందికి వ్యాక్సిన్ అందించేలా కేంద్ర ప్రభుత్వం టార్గెట్ పెట్టుకోవడం జరిగింది.