ప్రభాస్ బాలీవుడ్ ఎంట్రీ మూవీ ఆదిపురుష్ పాన్ ఇండియా మూవీగా కాకుండా పాన్ ఇంటర్నేషనల్ మూవీగా విడుదల అవ్వబోతుంది.బాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం 500 కోట్ల బడ్జెట్ తో రూపొందుతున్న ఈ సినిమా ను ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల్లో విడుదల చేయబోతున్నారట.
ఇప్పటికే ఆ దేశాల్లో రిలీజ్ కన్ఫర్మ్ అయ్యింది.ఈ నెంబర్ విడుదల సమయంకు మరింత పెరిగినా ఆశ్చర్యం లేదు.
ఈ సినిమా ను 75 భాషల్లో విడుదల చేయడం కోసం గాను ఇంగ్లీష్ తో పాటు స్పానిష్ ఇంకా పలు ఫారిన్ భాషల్లో డబ్ చేయబోతున్నారు.అందుకు తగ్గట్లుగా కంటెంట్ ఉంటుందని మేకర్స్ అంటున్నారు.2500 కోట్ల వసూళ్లు లక్ష్యంగా ఈ సినిమా ను విడుదల చేస్తున్నామని అంటున్నారు.సినిమా కాస్త పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నా.
ఇంటర్నేషనల్ స్క్రీన్స్ లో ఈ సినిమా ఆడిందంటే మూడు నాలుగు వేల కోట్ల వసూళ్లు కూడా నమోదు అవ్వడం పెద్ద కష్టం ఏమీ కాదని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
ఆదిపురుష్ సినిమా షూటింగ్ పునః ప్రారంభంకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.ఈ సినిమా లో ప్రభాస్ ను రాముడిగా దర్శకుడు చూపించబోతున్నాడు.రామాయణం ను కొత్త యాంగిల్ లో చూపించబోతున్నట్లుగా చెబుతున్న ఈ సినిమా టెక్నికల్ విషయంలో ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై రానటువంటి సినిమాగా చెబుతున్నారు.
దాదాపుగా 300 కోట్ల రూపాయలను వీఎఫ్ ఎక్స్ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా చెబుతున్నారు.అద్బుతమైన విజువల్ వండర్ గా ఈ సినిమా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
ప్రస్తుతం సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను ఇంటర్నేషనల్ వేదికల పై జరుపుతూనే ఉన్నారు.వచ్చే ఏడాది ఆగస్టులో విడుదల కాబోతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా స్థాయిని ఆకాశమే హద్దు అన్నట్లుగా ప్రపంచ వ్యాప్తంగా విస్తరింపజేస్తుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.