గోపీచంద్ హీరోగా బి గోపాల్ దర్శకత్వంలో చాలా ఏళ్ల క్రితం ఒక సినిమా స్టార్ట్ అయ్యింది.మాస్, యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతోతెరకెక్కిన ఆ మూవీలో గోపీచంద్ కి జోడీగా నయనతార నటించింది.
అయితే ఈ మూవీ ఇప్పటికే రెండు సార్లు పేర్లు మార్చుకొని రిలీజ్ దగ్గరకి వచ్చి ఆగిపోతుంది.దీంతో దర్శకుడు బి గోపాల్, హీరో గోపీచంద్ ఈ మూవీ రిలీజ్ పక్కన పెట్టి తమ నెక్స్ట్ సినిమాలు చేసుకుంటున్నాడు.
ఇక ఆరడుగుల బుల్లెట్ పూర్తి చేసిన తర్వాత గోపీచంద్ నటించిన మూడు సినిమాల వరకు రిలీజ్ అయ్యాయి.కాని ఈ మూవీ మాత్రం రిలీజ్ వరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది.
రేపు రిలీజ్ చేస్తామని ప్రకటించి మళ్ళీ ఆగిపోతుంది.అయితే కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ మూవీ ఒటీటీలో రిలీజ్ అవుతుందనే ప్రచారం జరిగింది.
అయితే ఏ ఒటీటీ సంస్థ నుంచి ఈ మూవీని కొనడానికి ముందుకి రాలేదు.దీంతో నిర్మాత మళ్ళీ థియేటర్స్ రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.
తాజాగా ఈ మూవీ నిర్మాత తాండ్ర రమేష్ చిత్రం రిలీజ్ పై స్పష్టత ఇచ్చారు.జయబాలజీ రీల్ మీడియా ప్రైవేట్ లిమిలెట్ పతాకంపై ఈ మూవీని తాండ్ర రమేష్ నిర్మించిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే ఈ మూవీని ఎప్పుడో రిలీజ్ చేద్దామని అనుకున్న లాక్ డౌన్, సెకండ్ వేవ్ కారణంగా వాయిదా వేయాల్సి వచ్చిందని నిర్మాత స్పష్టం చేశాడు.ఇప్పటికే నిర్మాణాంతర కార్యక్రమాలు పూర్తయ్యాయని, థియేటర్స్ ఓపెన్ కాగానే టైం చూసుకొని రిలీజ్ చేస్తామని చెప్పారు.
ఇదిలా ఉంటే గోపీచంద్ సంపత్ నంది దర్శకత్వంలో నటించిన సిటీమార్ మూవీ కూడా రిలీజ్ కి రెడీ అవుతుంది.ఇప్పటికే రిలీజ్ కావాల్సిన ఈ మూవీ కూసా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
ఈ రెండింట్లో ఏది ముందుగా థియేటర్ లోకి వస్తుందనేది వేచి చూడాలి.