తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లాల పర్యటన నేటి నుండి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే.ఈ పర్యటనలో భాగంగా సిద్దిపేట జిల్లాలో పర్యటించిన కేసీఆర్.
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పోలీస్ శాఖ కమిషనరేట్ భవనాలను ప్రారంభించారు.ఈ పర్యటన లో పాల్గొన్న మంత్రి హరీష్ రావు.సీఎం కేసీఆర్ పై పొగడ్తల వర్షం కురిపించారు.1983లో సిద్దిపేట నీ జిల్లాగా మార్చాలని అప్పటి ముఖ్యమంత్రి ఎన్ టి ఆర్ కి విజ్ఞప్తి చేసింది కేసిఆర్ అని గుర్తు చేశారు.
అప్పట్లో ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా అన్ని తట్టుకుని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించింది సిద్దిపేట జిల్లా ని ఏర్పాటు చేసింది సీఎం కేసీఆర్ అంటూ మంత్రి హరీష్ ప్రశంసించారు.వ్యవసాయ పరంగా తెలంగాణ రాష్ట్రాన్ని సిద్దిపేట జిల్లాని అభివృద్ధి పథంలో సీఎం కేసీఆర్ నడిపిస్తున్నారు అంటూ పొగడ్తల వర్షం కురిపించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా బంగారు తెలంగాణ వైపు దిశగా.రాష్ట్రాన్ని కేసిఆర్ పరిపాలిస్తున్నారు అని మంత్రి హరీష్ పేర్కొన్నారు.