టాలీవుడ్ ఇండస్ట్రీకి మెగాస్టార్ గా చిరంజీవి ఎన్నో విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు రికార్డులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఈరోజు ఇంటర్నేషన్ ఫాదర్స్ డే కాగా ఈ సందర్బంగా చిరంజీవి పెట్టిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
చిరంజీవి తండ్రి కొణిదెల వెంకట్రావు పోలీస్ కానిస్టేబుల్ గా పని చేశారు.చిరంజీవి హీరోగా తెరకెక్కిన మంత్రిగారి వియ్యంకుడు సినిమాలో కొణిదెల వెంకట్రావు చిన్న పాత్ర చేయడం గమనార్హం.
ఈరోజు ఫాదర్స్ డే కావడంతో చిరంజీవి తన తండ్రితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.తండ్రితో కలిసి దిగిన ఫోటోను చిరంజీవి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో పాటు మా నాన్నకు కోపం ఎక్కువని పేర్కొన్నారు.
అయితే కోపం ఎక్కువ అయినా ఆ కోపానికి ప్రేమ కూడా ఎక్కువేనని ఆ ప్రేమకు బాధ్యత కూడా ఎక్కువని చిరంజీవి పేర్కొన్నారు.కుటుంబ బాధ్యతలను నెరవేర్చడం కొరకు శ్రమించే నాన్నలందరికీ చిరంజీవి ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్పారు.
చిరంజీవి పెట్టిన పోస్ట్ కు 12,000కు పైగా లైక్ లు వచ్చాయి.గతేడాది నుంచి చిరంజీవి సోషల్ మీడియాలో తెగ యాక్టివ్ గా ఉన్నారనే సంగతి తెలిసిందే.మరోవైపు చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా పూర్తైన తరువాత లూసిఫర్ రీమేక్ షూటింగ్ లో చిరంజీవి పాల్గొంటారు.మరోవైపు చిరంజీవి ఈ మధ్య కాలంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.
చిరంజీవి చేస్తున్న సేవా కార్యక్రమాలకు నెటిజన్ల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.ఆచార్య మూవీలో చిరంజీవికి జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే.కొరటాల శివ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుండగా రామ్ చరణ్, పూజా హెగ్డే కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు.