కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎత్తివేస్తున్నట్లుగా నిర్ణయం తీసుకుంది.దాంతో టాలీవుడ్లో షూటింగ్స్ హడావుడి మొదలు అయ్యింది.
ఇప్పటికే ఒకటి రెండు సినిమాలు షూటింగ్స్ ప్రారంభం అయ్యాయి.జులై నెలలో ఎన్నో సినిమాల చిత్రీకరణ మొదలు అవ్వబోతున్నాయి.
మహేష్ బాబు మరియు పరశురామ్ ల కాంబినేషన్ లో రూపొందుతున్న సర్కారు వారి పాట చిత్రీకరణను జులై నెలలో నిర్వహించబోతున్నారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా మొదలు అయ్యాయి.
మరో వైపు మహేష్ బాబు తదుపరి సినిమా కు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ సినిమా స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని అంటున్నారు.
మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల కాంబోలో గతంలో వచ్చిన అతడు మరియు ఖలేజా సినిమా లు థియేటర్లలో అంతగా ఆకట్టుకోలేక పోయాయి.కాని బుల్లి తెర మీద వీరి కాంబో మూవీస్ భారీ విజయాన్ని సొంతం చేసుకున్న విషయం తెల్సిందే.
అందుకే మళ్లీ వీరి కాంబో లో మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.ఇలాంటి సమయంలో రూపొందుతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి.
అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ను రూపొందిస్తున్నట్లుగా చెబుతున్నారు.
ఇక ఈ సినిమా లో మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ ల మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఈ సినిమా లో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయమై స్పష్టత రాలేదు.కాని త్వరలోనే ఈ సినిమా హీరోయిన్ ను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
షూటింగ్ ను ఆగస్టులో మొదలు పెట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.పూర్తి వివరాలు త్వరలోనే వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.