తెలంగాణ పొలిటికల్ స్క్రీన్ పై కొత్త ఆట మొదలైంద దాదాపుగా తెలంగాణ ఉద్యమ సమయంలో చూసిన ఈ గారడీని మళ్ళీ చూడబోతున్నాం అని జనం అనుకుంటున్నారట.ఇంతకు రాజకీయాల్లో వచ్చిన మార్పు ఏంటంటే ఇన్నాళ్లుగా ఫాం హౌజ్కే పరిమితం అయ్యిన సీఎం కేసీఆర్ అంటూ విమర్శలు అందుకున్న గులాభి దొర, ఈటల వదిలిన బళ్లాలు గట్టిగా గుచ్చుకోకుండా ఇప్పటి నుండే కారుకు సెక్యూరీటీని ఏర్పాటుచేసే క్రమంలో తానే స్వయంగా రంగంలోకి దిగినారట.
ఇందులో భాగంగానే వరుస పర్యటనలతో క్రెడిట్ దక్కించుకుని ప్రజల్లో ఇంకా పరపతి పెంచుకుని వచ్చే ఎన్నికల్లో కూడా గులాభి నేతలు పదవులు అనుభవించేలా వ్యూహరచన చేశారట.ఇకపోతే సిద్దిపేట జిల్లాలో నేడు పర్యటించనున్న సీఎం కేసీఆర్ ఇందులో భాగంగా ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఇంటిగ్రేటెడ్ కలెక్టర్ కార్యాలయాన్ని, కొత్తగా నిర్మించిన ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ను, తర్వాత సిద్దిపేట పట్టణ శివారులో పోలీస్ కమిషనరేట్ కార్యాలయాన్ని, ప్రారంభించనున్నారట.
ఈ ఫోగ్రాం ముగిసిన తర్వాత మంత్రి హరీష్ రావుతో పాటుగా ప్రజా ప్రతినిధులు, అధికారులతో బిజీ షెడ్యూల్డ్ ఫిక్స్ చేసుకున్నారట.