యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా సినిమాలని లైన్ లో పెట్టిన సంగతి తెలిసిందే.వాటిలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ కూడా ఉంది.
సుమారు 150 కోట్ల బడ్జెట్ తో హోంబలే ఫిలిమ్స్ ఈ మూవీని నిర్మిస్తుంది.ఇక ఇప్పటికే ఈ మూవీ ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ కంప్లీట్ అయ్యింది.
సెకండ్ షెడ్యూల్ కి రంగం సిద్ధం అవుతుంది.ఇదిలా ఉంటే మరో వైపు ఆర్ఎఫ్సీలో ఆది పురుష్ షూటింగ్ కూడా జులై మొదటి వారం నుంచి ప్రారంభం కానుంది.
ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసేశాడు.మరో పది రోజుల షెడ్యూల్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది.
అది కంప్లీట్ అయితే రాధేశ్యామ్ కి గుమ్మడికాయ కొట్టేస్తారు.ఇదిలా ఉంటే సలార్ మూవీ సెకండ్ షెడ్యూల్ కోసం ప్రశాంత్ నీల్ రెడీ అవుతున్నాడు.
ఇక ఈ మూవీగురించి తాజాగా మరో ఆసక్తికర అప్డేట్ వచ్చింది.ప్రస్తుతం డిజిటల్ ఒటీటీ చానల్స్ ఇండియన్ ఎంటర్టైన్మెంట్ మార్కెట్ పై ఆధిపత్యం కోసం ప్రయత్నం చేస్తున్నాయి.ఈ నేపధ్యంలో పీద సినిమాల కోసం ఎంత పెద్ద మొత్తం అయినా ఇవ్వడానికి ముందుకొస్తున్నాయి.గతంలో అక్షయ్ కుమార్ లక్ష్మి బాంబ్ మూవీకి డిస్నీ హాట్ స్టార్ ఏకంగా వంద కోట్లు ఇచ్చి ఒటీటీ రిలీజ్ కోసం సొంతం చేసుకుంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు సలార్ మూవీ కోసం ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ అంతకు మించిన సొమ్ము ఆఫర్ చేసింది.ఏకంగా 130 కోట్లు డిజిటల్ రైట్స్ కోసం అమెజాన్ నిర్మాతలకి ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ మొత్తం అంటే సినిమాకి పెట్టిన పెట్టుబడిలో 80 శాతం వెనక్కి వచ్చినట్లే.ఇంత పెద్ద మొత్తం ఆఫర్ కూడా డైరెక్ట్ రిలీజ్ కోసం కాకుండా థియేటర్ లో రిలీజ్ చేసిన కొద్ది రోజుల తర్వాత ఒటీటీలో రిలీజ్ చేసుకోవడానికి అమెజాన్ ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది.