తెలుగు సినీ దర్శకుడు, నిర్మాత శేఖర్ కమ్ముల దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే.ఆయన దర్శకత్వం వహించిన సినిమాలన్ని మంచి సక్సెస్ ను అందించాయి.
ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, లీడర్, ఫిదా వంటి సినిమాలలో దర్శకత్వం వహించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.ఇక ఇటీవలే నాగ చైతన్య, సాయి పల్లవి తో కలిసి లవ్ స్టోరీ సినిమాను చేయగా ప్రస్తుతం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇక ఈ మధ్య మరింత రేంజ్ పెంచుకుంటూ పోతున్నాడు శేఖర్ కమ్ముల.పాన్ ఇండియా సినిమా కు దగ్గర్లోనే బాలీవుడ్ లో కూడా సినిమాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇదిలా ఉంటే తాజాగా మరో స్టార్ హీరో ధనుష్ తో ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.దీంతో వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా వస్తుందని తెలియడంతో అభిమానులు తెగ సంతోష పడుతున్నారు.
నిజానికి ధనుష్ సినిమాలంటే ఎలా ఉంటాయో అందరికీ తెలిసిందే.ప్రతి ఒక్క సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న ధనుష్.ఎక్కువగా ఆసక్తికర పాత్రలతో ముందుకు వస్తాడు.పైగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అంటే మరింత రేంజ్ ఉంటుంది.ఇక ఈ సినిమాని మూడు భాషలలో తెరకెక్కించనున్నారు.ఈ సినిమా కథను మంచి క్రేజ్ ఉన్న కథతోనే రూపొందుతున్నట్లు తెలుస్తుంది.
ఇదంతా ఇలా ఉంటే ఈ సినిమా కోసం హీరోయిన్ ఎవరా అని వార్తలు వినిపించగా.నేరుగా సాయి పల్లవిని ఫిక్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది.ఇదివరకే ఈయన దర్శకత్వంలో ఫిదా సినిమాలో నటించిన ఈ బ్యూటీ మంచి సక్సెస్ అందుకోగా.ధనుష్ తో కూడా నటించి మంచి క్రేజ్ ను అందుకుంది.
ఇక మొత్తానికి ఈ సినిమాలో సాయి పల్లవిని తీసుకోవడమే కాకుండా భారీ రెమ్యునరేషన్ కూడా ఆఫర్ చేశాడట.అంతేకాకుండా ఈ సినిమాలో వెంకటేష్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.