టాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ దిల్ రాజు ఇప్పటి వరకు మీడియం రేంజ్ సినిమాలు ఎక్కువగా భారీ బడ్జెట్ సినిమాలు తక్కువగా చేస్తూ వచ్చాడు.స్టార్ హీరోల తో ఈయన నిర్మించిన సినిమాలు కూడా మీడియం బడ్జెట్ చిత్రాలే అనడంలో సందేహం లేదు.
కాని ఇప్పుడు ఇతర నిర్మాతలను చూసి ఈయన మారిపోయాడు.మైత్రి వారు ప్రస్తుతం వెయ్యి కోట్లకు పైగా విలువైన ప్రాజెక్ట్ లను చేస్తున్నారు.
వారికి ఏమాత్రం తగ్గకుండా ఏకంగా మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ లను దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.అందులో ఇప్పటికే రెండు అధికారికంగా క్లారిటీ వచ్చేసింది.
అందులో మొదటిది చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా.ఈ సినిమా కు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.
దాదాపుగా ఈ సినిమా నుండి 300 నుండి 350 కోట్ల వరకు ఖర్చు చేసి నిర్మిస్తాడని సమాచారం అందుతోంది.ఈ సినిమా లో నటిస్తున్న మరియు సాంకేతిక నిపుణుల పారితోషికాలే 150 నుండి 175 కోట్లు ఉంటుందని సమాచారం అందుతోంది.
తమిళ సూపర్ స్టార్ విజయ్ తో కూడా ఒక సినిమా ను దిల్ రాజు కన్ఫర్మ్ చేశాడు.ఏకంగా వంద కోట్ల పారితోషికంను విజయ్ కు దిల్ రాజు ఇవ్వబోతున్నాడు.వంద కోట్ల పారితోషికంతో పాటు మరో 200 కోట్ల ను కూడా ఆ సినిమా పై దిల్ రాజు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఇక ప్రశాంత్ నీల్ తో ప్రభాస్ సినిమా ను కూడా ఈయన మొదలు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం దిల్ రాజు ప్రశాంత్ నీల్ సినిమాకు కూడా 250 కోట్లకు తగ్గకుండా ఖర్చు పెట్టబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.ఈ మూడు ప్రాజెక్ట్ లపై దిల్ రాజు ఏకంగా రూ.850 కోట్ల ను పెట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.రికార్డు బ్రేకింగ్ వసూళ్లతో ఈ సినిమా లు దిల్ రాజుకు వెయ్యి నుండి 1250 కోట్ల ను అయినా వెనక్కు రాబట్టే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు నమ్ముతున్నారు.
మరి ఆ రేంజ్ లో ఈ సినిమా లు వసూళ్లు సాధిస్తాయా లేదంటే ఈ సినిమా లు దిల్ రాజు ప్లాప్ సినిమా ల జాబితాలో చేరతాయో చూడాలి.