తెలంగాణ లో లాక్ డౌన్ ను ఎత్తి వేశారు. రేపటి నుండి అన్ని విధాలుగా జన జీవనం సాధారనంగా గడిపేయ వచ్చు.
రాష్ట్రంలో కేసులు చాలా తక్కువగా నమోదు అవుతున్నాయి.కనుక అన్నింటికి కూడా అనుమతులు వచ్చాయి.
దాంతో షూటింగ్ లు కూడా రెగ్యులర్ గా మొదలు అవ్వబోతున్నాయి.షూటింగ్ లకు ఇప్పటికే ఏర్పాట్లు జరుగుతున్నాయి.
జులై మొదటి వారంలో షూటింగ్ కు వెళ్లేందుకు సిద్దం అవ్వాలంటే ఇప్పటికే పలువురు ఫిల్మ్ మేకర్స్ తమ యూనిట్ సభ్యులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది.పవన్ మరియు రానా ల మూవీ షూటింగ్ కు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
దర్శకుడు సాగర్ చంద్ర మరియు నిర్మాతలు అందుకు సంబంధించిన ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నారు.
కరోనా బారిన పడ్డ పవన్ కళ్యాణ్ కోలుకున్నా కూడా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.
ఆయన కాస్త వీక్ గా ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి.ఈ సమయంలో చిత్ర యూనిట్ సభ్యులు సినిమా ను జులై 11 నుండి రెగ్యులర్ షూటింగ్ కు తీసుకు వెళ్లేలా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
పెద్ద ఎత్తున అంచనాలున్న ఈ సినిమా షూటింగ్ ను పునః ప్రారంభించి ఆగస్టులో షూటింగ్ ను ముగించబోతున్నారు.ఇక సినిమా ను ఇదే ఏడాది చివర్లో విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
ప్రస్తుతం సినిమాకు సంబంధించిన నిర్మాణానంతర కార్యక్రమాలు కూడా జరుపుతున్నారు.కెమెరా ముందుకు పవన్ వచ్చేందుకు రెడీ అవుతున్నాడు.జులై 11 న ఆయన వచ్చేందుకు అంతా సిద్దం అయ్యింది.దాదాపుగా మూడు నెలలుగా ఆయన పూర్తిగా కనిపించకుండా పోయారు.ఇన్నాళ్ల తర్వాత రీ ఎంట్రీకి సిద్దం అయ్యారు. ఈ సినిమా మలయాళం సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియుమ్ కు రీమేక్ అనే విషయం తెల్సిందే.
రానా తో కలిసి పవన్ చేసే సన్నివేశాలు అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటాయని అంటున్నారు.