ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంసెట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ కి సంబంధించి షెడ్యూల్ ప్రకటించడం జరిగింది.ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎంసెట్ కు బదులుగా ఈఏపి సెట్ (EAPCET) నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ గా ఈఏపీ సెట్ ను నిర్వహిస్తున్నట్లు ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.దీంతో ఇప్పటి వరకు వినికిడి లో ఉన్న ఎంసెట్ ఈఏపి సెట్ (EAPCET) గా మార్పు చేసినట్లు చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఈ నెల 24వ తారీఖున విడుదల చేస్తామని 26 నుండి అప్లికేషన్ అప్లై చేసుకో వచ్చింది ఆగస్టు 19 నుండి 25 వరకు వీటికి సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తామని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.
అదే రీతిలో ఐసెట్, ఈసెట్, పీజీఈసెట్, లాసెట్, ఎడ్సెట్, పీఈసెట్ ప్రవేశ పరీక్షలను సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో నిర్వహించే అవకాశం ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ పేర్కొన్నారు.