ఏపీ సీఎం జగన్ ఇంటి వద్ద పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు పోలీసులు.అమరావతి రైతుల దీక్షలకు రేపటికి 550 రోజులు కానుంది.
ఈ నేపథ్యంలో నిరసనకారులు సీఎం క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడిస్తారన్న సమాచారంతో పోలీసులు ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమయ్యారు.శనివారం రైతుల నిరసన ప్రదర్శనలు, ర్యాలీలకు అనుమతి ఇవ్వలేదు.
తాడేపల్లి సీఎం జగన్ నివాసం వద్ద కూడా పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.సీఎం ఇంటి వద్ద ఎవరైనా కొత్త వారికి ఆశ్రయ కల్పిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు.
సీఎం క్యాంప్ కార్యాలయం మార్గాల్లో పెద్ద ఎత్తున బలగాలను మోహరించారు.
ఏపీ రాజధాని అమరావతి నుండి మూడు రాజధానులు ప్రకటించిన దగ్గర నుండి అమరావతి రైతులు దీక్షకు దిగారు.
వారు చేస్తున్న దీక్ష 550 రోజులు పూర్తి కావడంతో నిరసన కారులు ఎవరైనా సీఎం కార్యాలయాల ముందు నిరసన తెలియచేసే అవకాశం ఉందన్న కారణం చేత రేపు ర్యాలీలు, ధర్నాలు చేయకూడదని పోలీసులు ముదస్తు చర్యలు చేపట్టారు.