ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతూ ఉండటంతో ప్రభుత్వం కర్ఫ్యూ సమయంలో సడలింపులు ఇస్తూ ఉంది.ప్రస్తుతం ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు కర్ఫ్యూ అమలు అవుతున్న సంగతి తెలిసిందే.
అయితే జూన్ 21వ తారీకు నుండి 30 వ తారీఖు వరకు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కర్ఫ్యూ సమయాన్ని పొడిగిస్తూ కొత్త సడలింపులు అందిస్తూ ఏపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకోవడం జరిగింది.
ఈరోజు కోవిడ్ సమీక్ష సమావేశం జరిపిన సీఎం జగన్ .వైద్యశాఖ మంత్రి ఆళ్ల నాని తో ఉన్నతాధికారులతో భేటీ అయి ఈ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది.అయితే సాయంత్రం ఐదు గంటల గల దుకాణాలు మూసేయాలి అని .ఆరు గంటల లోపు ఇంటికి వెళ్లిపోవాలని ప్రజలకు సూచించింది.రాష్ట్రంలో కర్ఫ్యూను అమలు చేయటంతో.
చాలా వరకు కరోనా కట్టడి చేయగలిగినట్లు.మెరుగైన ఫలితాలు రాబట్టినట్లు ఈ సమావేశంలో మంత్రులతో.
ఉన్నతాధికారులతో సీఎం జగన్ పేర్కొన్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే తూర్పుగోదావరి జిల్లాలో కరోనా తీవ్రత అధికంగా ఉండటంతో ప్రస్తుతం అమలవుతున్న టైమింగ్స్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు టైమింగ్స్ కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.