మన భారతదేశంలో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తగా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకున్నారు ఆనంద్ మహీంద్రా. ఆనంద్ మహేంద్ర సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు యాక్టివ్ గా ఉండడంతో పాటు, కొన్ని ఆసక్తికరమైన విషయాలను, జంతువులకు సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం.
ఇందులో కొన్ని వీడియోలకు తనదైన రీతిలో ప్రశ్నలను కూడా అడగడం మనం చూస్తూనే ఉంటాం.కొన్ని కొన్ని సందర్భాలలో ఆనంద్ సమాధానాలు కూడా చెప్పడం మనం చూశాం.
అయితే తాజాగా మహేంద్ర షేర్ చేసిన వీడియో పై చర్చ కొనసాగుతోంది.
తాజగా ఆనంద్ మహేంద్ర షేర్ చేసిన వీడియో ప్రజల దృష్టినీ ఆకర్శించిన వీడియో లలో ఒకటిగా నిలిచింది.
ఇంతకు ఆ వీడియోలో ఏముందని అనుకుంటున్నారా…? ఒక నదిలో చాలా సింహాల గుంపుగా వరుసగా నీళ్లు తాగుతూ ఉంటాయి.అయితే ఇంతలో ఒక ఓ సింహం దూరంగా ఒంటరిగా నీరు తాగడం గమనించవచ్చు.
ఇందుకు సంబంధించిన వీడియో ఆనంద్ మహీంద్రా సోషల్ మీడియా ద్వారా షేర్ చేస్తూ ఒంటరిగా ఆ సింహం నీరు తాగడానికి గల కారణం ఏమిటి.? సింహం ఒక ట్రంప్ లేదా మిస్ఫిట్ కావచ్చునని తనదైన రీతిలో ప్రశ్నలను అడిగారు ఆనంద్ మహేంద్ర.
షేర్ చేసిన ఇందులో ఒక వీడియోల శీర్షికలో, “ వీడియోలోని చివరి షాట్ చూడండి.సింహం మాత్రమే ఎందుకు దూరంగా ఉంది.? జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే వారికి దీనికి కారణం తెలుస్తుంది.కానీ మనం ఆ సింహాన్ని మిస్ఫిట్ గా చూస్తామా అనే దాని గురించి మరింత చెబుతుందని నేను అనుకుంటున్నాను ” అంటూ చెప్పుకొచ్చారు మహేంద్ర.
ఈ వీడియోలను వీక్షించిన కొంతమంది నెటిజన్ వారి రీతిలో కామెంట్స్ పెడుతున్నారు.ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఈ వీడియోలను చూడండి.