నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సినిమా చేస్తున్నాడు.గత కొన్ని రోజులుగా బాలకృష్ణ హిట్స్ లేక బాధపడుతున్నాడు.
బోయపాటి, బాలయ్య కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు పీక్స్ లో ఉంటాయి.ఎందుకంటే వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ సినిమాలు బ్లాక్ బస్టర్ సినిమాలు హిట్ అయ్యాయి.
ఇప్పుడు అఖండ సినిమాపై కూడా ఇలాంటి అంచనాలే ఉన్నాయి.
ఇప్పటికే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యి ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.
ఈ టీజర్ చూసిన తర్వాత ఇది కూడా బ్లాక్ బస్టర్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్, సయేశా సైగల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
ఈ సినిమాను ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నారు.థమన్ సంగీతం అందిస్తుండడంతో పాటల విషయంలో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది.ఈ సినిమా ఇంకా షూటింగ్ 15 నుండి 20 రోజులు చేస్తే షూట్ మొత్తం కంప్లీట్ వార్తలు వచ్చాయి.ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతుండడంతో మళ్ళీ షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది.ఇది ఇలా ఉంటే తాజాగా ఈ సినిమాలో నటిస్తున్న హీరో శ్రీకాంత్ కొన్ని ఆసక్తికర విషయాలను మీడియాతో పంచుకున్నాడు.
ఈ సినిమాలో బాలయ్య చెప్పే డైలాగ్స్ కు ఫ్యాన్స్ విజిల్ వేయడంతో పాటు థియేటర్స్ కూడా దద్దరిల్లడం ఖాయం అని తెలిపాడు.అంతేకాదు బాలయ్య ఈ సినిమాలో రెండు రోల్స్ మాత్రమే చేస్తున్నాడని కన్ఫర్మ్ చేసాడు.అందులో అఘోర పాత్ర రోల్ లా కాకుండా చాలా ఉన్నతంగా ఉంటుందని కూడా శ్రీకాంత్ తెలిపారు.ఈ విషయంపై బాలయ్య అభిమానులు ఫూల్ ఎక్సయిట్ అవుతున్నారు.