ఆనంద్, హ్యాపీ డేస్, ఫిదా సినిమాలతో టాలీవుడ్ లో కొత్త ప్రేమ కథలను తెరకెక్కించిన శేఖర్ కమ్ములకు యూత్ లో మంచి ఫాలోయింగ్ ఉంది.తన సినిమాలంటే ఫ్యామిలీ మొత్తం ఒక దగ్గర కూర్చుని చూడగలిగేలా ఉంటాయి.
ఈయన ప్రేమ కథలను తెరకెక్కించడంలో మంచి పట్టు ఉంది.మనసుకు హత్తుకునేలా తీయగలిగే సత్తా ఉంది.
శేఖర్ కమ్ముల సినిమాల్లో హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ పాత్రలకే అన్నట్టు ఉండదు.
హీరోయిన్ కు కూడా నటన పై మంచి స్కోప్ ఉంటుంది.
ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ‘లవ్ స్టోరీ‘ అనే ప్రేమ కథను తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమాకు దాదాపు 35 కోట్ల వరకు బడ్జెట్ పెట్టినట్లు సమాచారం.
ఈ చిత్రం పై ప్రేక్షకులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉంది.
ఈ సినిమాను ఏప్రిల్ 16 న విడుదల చేయడానికి సన్నాహాలు చేయగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.ఇప్పుడిప్పుడే అన్ని సర్దుకుంటున్న సమయంలో మళ్ళీ కొత్త విడుదల తేదీని ప్రకటించనున్నారు.ఇది ఇలా ఉంటే ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల చేయబోయే సినిమా గురించి ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఇప్పటికే చాలా మంది పేర్లు వినిపించాయి.
శేఖర్ కమ్ముల కోలీవుడ్ హీరో ధనుష్ కలిసి ఒక సినిమా చేయబోతున్నారని వార్తలు బాగా వైరల్ అయ్యాయి.తాజాగా ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చింది. ధనుష్ హీరోగా శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఒక పాన్ ఇండియా సినిమా రాబోతుందని ఈ రోజు అఫీషియల్ గా అనౌన్స్ చేసారు.ఈ ప్రకటనతో ఈ క్రేజీ కాంబినేషన్ పై ప్రేక్షకులు బాగా ఆసక్తి కనబరుస్తున్నారు.
మరి చూడాలి శేఖర్ కమ్ముల ధనుష్ ను ఎలా ప్రెసెంట్ చేస్తాడో.