టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.తెలుగు సినీ పరిశ్రమలో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.
స్టార్ హీరోల సరసన నటించిన ప్రియమణి తెలుగులోనే కాకుండా హిందీలో కూడా నటించింది.కెరీర్ మొదట్లో తెలుగమ్మాయిగా కనిపించిన ప్రియమణి ప్రస్తుతం గ్లామర్ ను కూడా పరిచయం చేస్తుంది.
తన పెళ్లి తర్వాత గతంలో కొన్ని రోజులు సినిమాలకు దూరంగా ఉన్న ప్రియమణి మళ్లీ రీ ఎంట్రీ తో వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.
ఇటీవలే ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా నటించగా తన పాత్రకు మంచి సక్సెస్ అందుకుంది.ఇక బుల్లితెరలో కూడా ఓ డాన్స్ షోలో జడ్జిగా చేస్తుంది.ఇక లేటు వయసులో కూడా తన అందాలను బాగా పరిచయం చేస్తుంది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది ప్రియమణి.ఇదిలా ఉంటే ప్రియమణికి ఓ కోరిక ఉందట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి తనకు ఓ పాత్రలో నటించాలని ఉందని తెలిపింది.
తెలుగు సీనియర్ నటి రమ్యకృష్ణ చేసిన నీలంబరి లాంటి పాత్రలలో చేయాలని తన కోరిక అని తెలిపింది.
నీలంబరి లాంటి పాత్రలతో తన బాడీ లాంగ్వేజ్, తన డైలాగ్ డెలివరీ పొగరుబోతు పాత్రలకు కరెక్టు సరిపోతానని అనుకుంటుందట ప్రియమణి.మొత్తానికి ప్రియమణి ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తున్న తరుణంలో ఇలాంటి పాత్రలు వస్తే అసలు కాదనకుండా చేస్తానంటుంది.
ప్రస్తుతం ప్రియమణి దగ్గుబాటి రానా నటిస్తున్న విరాటపర్వం సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోందట.అంతేకాకుండా వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో కూడా బిజీగా ఉందట ప్రియమణి.మొత్తానికి రీ ఎంట్రీ తో కూడా బాగా దూసుకుపోతుంది ప్రియమణి.