నేటి ఆధునిక కాలంలో అరవై ఏళ్లు దాటిన వారే కాదు వయసులో ఉన్న వారు కూడా కీళ్ల నొప్పులను ఎందుర్కొంటున్నారు.మోకాళ్లు, పాదాలు, మోచేయి, భుజాలు ఇలా తదితర భాగాల్లో కీళ్ల నొప్పులు పడుతూ ఉంటాయి.
దాంతో లేవాలన్నా, కూర్చోవాలన్నా, అడుగు తీసి అడుగేయాలన్నా తెగ ఇబ్బంది పడుతూ ఉంటారు.ఈ క్రమంలోనే కీళ్ల నొప్పులను నివారించుకునేందుకు పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు.
కానీ, పెయిన్ కిల్లర్స్ యూజ్ చేయడం కన్నా న్యాచురల్ పద్ధతుల్లో నొప్పులను తగ్గించుకోవడానికి ప్రయత్నించాలి.
ముఖ్యంగా అందుకు కలబంద అద్భుతంగా సహాయపడుతుంది.
సౌందర్య సాదనలో ఎక్కువగా ఉపయోగించే కలబంద ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడుతుంది. కలబందలో విటమిన్స్, మినిరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, అమినో యాసిడ్స్, ఫ్యాటీ యాసిడ్స్ ఇలా బోలెడు పోషకాలు ఉంటాయి.
అందుకే కొన్ని వేల సంవత్సరల నుండి కలబందను ఔషదంగా ఉపయోగిస్తున్నారు.
అలాగే కీళ్ల నొప్పులను నివారించడంలోనూ కలబంద గ్రేట్గా ఉపయోగపడుతుంది.రెండు స్పూన్ల కలబంద జెల్, ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ నిమ్మ రసం ఈ మూడిటిని మీక్సీలో వేసి జ్యూస్లా చేసుకోవాలి.ఇప్పుడు ఈ జ్యూస్ను పరగడుపున తీసుకోవాలి.
ఇలా ప్రతి రోజు చేస్తూ క్రమంగా కీళ్ల నొప్పులు మటు మాయం అవుతాయి.
అలాగే మీ కీళ్లు దృఢంగా తయారవుతాయి.
అంతేకాదు, ఈ కలబంద జ్యూస్ తీసుకోవడం వల్ల శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి.రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.
వెయిట్ లాస్ అవుతారు.మలబద్ధకం సమస్య తగ్గు ముఖం పడుతుంది.
ఎర్ర రక్త కణాల సంఖ్య పెరిగి.రక్త హీనత దరి దాపుల్లోకి రాకుండా ఉంటుంది.
మరియు చర్మం కూడా ఎల్లప్పుడూ యవ్వనంగా, కాంతి వంతంగా మెరుస్తూ కనిపిస్తుంది.