ప్రేక్షకులకు ఏ మాత్రం పరిచయం లేని ప్రతిభ ఉన్న కమెడియన్లు జబర్దస్త్ షో ద్వారా గుర్తింపును సంపాదించుకున సంగతి తెలిసిందే.జబర్దస్త్ ద్వారా మంచి పేరు తెచ్చుకున్న కమెడియన్లలో జీవన్ ఒకరు.
తాజాగా ఒక షోలో రామ్ ప్రసాద్, అదిరే అభి పాల్గొనగా జీవన్ ఆరోగ్యం గురించి వాళ్లు షాకింగ్ విషయాలను వెల్లడించారు.మే నెల 28వ తేదీ తరువాత జీవన్ జబర్దస్త్ లో స్కిట్ చేయలేదనే సంగతి తెలిసిందే.
చాలామంది జీవన్ ఏదైనా కారణం వల్ల జబర్దస్త్ షోకు దూరమై ఉండవచ్చని భావించగా రామ్ ప్రసాద్ వల్ల జీవన్ అనారోగ్య సమస్యలతో జబర్దస్త్ కు దూరమయ్యాడని తెలుస్తోంది.రామ్ ప్రసాద్ మాట్లాడుతూ అభినయ్ కృష్ణ జబర్దస్త్ షోకు పెద్ద తలకాయలాంటి వ్యక్తి అని ఎవరైనా ఇబ్బందులలో ఉన్నారని తెలిస్తే అభి మొదట స్పందించి తన వంతు సహాయం చేస్తారని రామ్ ప్రసాద్ చెప్పుకొచ్చారు.
ఏం చెప్పినా అభి ఆ పనిని ఏ విధంగా పూర్తి చేయాలో ప్లానింగ్ చెబుతాడని రామ్ ప్రసాద్ తెలిపారు.జీవన్ అనారోగ్య సమస్యల వల్ల ఐసీయూలో ఉన్నారని రామ్ ప్రసాద్ వెల్లడించారు.
డబ్బులను పోగు చేసి అభికి ఇస్తామని రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.జీవన్ ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు ఫిఫ్టీ ఫిఫ్టీ ఛాన్సెస్ అని చెప్పారని రామ్ ప్రసాద్ తెలిపారు.
డాక్టర్లతో కూడా అభి మాట్లాడేవాడని జీవన్ కుటుంబ సభ్యులు సైతం అభికే కాల్ చేసేవారని రామ్ ప్రసాద్ పేర్కొన్నారు.
అయితే ఏ కారణంతో జీవన్ ఆస్పత్రిలో చేరాడనే విషయం మాత్రం తెలియలేదు.జబర్దస్త్ కమెడియన్లు మనల్ని ఎంతో కష్టపడి నవ్విస్తున్నా వాళ్ల మాత్రం ఎన్నో కష్టాలు పడుతుండటం గమనార్హం.జబర్దస్త్ జీవన్ త్వరగా కోలుకోవాలని నెటిజన్లు కోరుకుంటున్నారు.