సినిమా పరిశ్రమలోని సెలబ్రిటీలు ఒక్కోసారి అనుకోకుండా తమ ప్రమేయం లేకున్నప్పటికీ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.కాగా సోషల్ మీడియాలో కొందరు చేసేటటువంటి పనులు కారణంగా సెలబ్రిటీల పరువు ప్రతిష్టలకు భంగం కలుగుతోంది.
కాగా ఆ మధ్య బాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ రియా సేన్ కి సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో లీక్ కావడంతో ఈ ప్రభావం ఈ అమ్మడి సినీ జీవితం పై పడింది.ఫలితంగా ప్రస్తుతం రియాసేన్ కి బాలీవుడ్ సినిమా పరిశ్రమలో కొత్తగా సినిమా ఆఫర్లు వరించలేదు.
అయితే ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే గతంలో రియా సేన్ నటించిన చిత్రాలలోని కొన్ని రొమాంటిక్ సన్నివేశాలను కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు అసభ్యకరంగా చిత్రీకరించి సోషల్ మీడియాలో ప్రచారాలు చేశారు.దీంతో ఈ వీడియో కొద్ది కాలంలోనే తెగ వైరల్ అయ్యింది.
దాంతో ఈ వీడియోల కారణంగా కొందరు దర్శక నిర్మాతలు రియా సేన్ కి సినిమా ఆఫర్లను ఇచ్చే విషయంలో సంకోచించారు.దీనికితోడు ఇప్పటివరకు రియా సేన్ కూడా ఈ ఫేక్ వీడియోలపై స్పందించకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది.
దీంతో కనీసం ఇప్పటికైనా రియా సేన్ ఈ ఎంఎంఎస్ స్కాండల్ పై స్పందించి క్లారిటీ ఇవ్వాలని ఆమె అభిమానులు కోరుతున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా రియాసేన్ తెలుగు తమిళం, హిందీ, తదితర, భాషలలో కలిపి దాదాపుగా 30 కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది.కాగా తెలుగులోరియాసేన్ మంచు మనోజ్ హీరోగా నటించిన “నేను మీకు తెలుసా.?” అనే చిత్రంలో హీరోయిన్ గా నటించి బాగానే ఆకట్టుకుంది.కానీ ఆ తర్వాత పలు అనివార్య కారణాల వల్ల ఈ అమ్మడు తెలుగు సినిమాల్లో నటించలేదు.అందువల్లనే ఈ అమ్మడి గురించి దాదాపుగా తెలుగు సినీ ప్రేక్షకులకు పెద్దగా తెలియదు.
అయితే ఈ మధ్య కాలంలో రియాసేన్ కి సినిమా అవకాశాలు లేకపోవడంతో వరుస ఫోటో షూట్లతో అందాల ఆరబోస్తూ కుర్రకారు గుండెల్లో హిట్ పెంచేస్తోంది.