తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన బంగారం చిత్రంలో హీరోయిన్ చెల్లెలు పాత్రలో నటించి తన ముద్దు ముద్దు మాటలతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన తమిళ బ్యూటీ సానుష ప్రేక్షకులకి సుపరిచితమే.కాగా ఈ మధ్యకాలంలో సానుష హీరోయిన్ గా అవకాశాల కోసం బాగానే ప్రయత్నాలు చేస్తోంది.
ఈ క్రమంలో సోషల్ మీడియా మాధ్యమాలను బాగా యాక్టివ్ గా ఉంటోంది.దీంతో కొందరు ఈ మధ్య సానుష చాలా బరువు పెరిగిందని, బొద్దుగా కనిపిస్తుందని, అలాగే హీరోయిన్ గా పనికి రాదంటూ కొంతమేర నెగిటివ్ గా ట్రోల్స్ చేస్తున్నారు.
దీంతో తాజాగా సానుష తన అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా స్పందించింది.ఇందులో భాగంగా తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోని షేర్ చేసింది.అంతేకాకుండా తన ఫిజిక్ మరియు బరువు గురించి అంతగా కేర్ తీసుకున్నందుకు ధన్యవాదాలు తెలిపింది.
అంతేకాకుండా తన బరువు గురించి తనకు బాగా తెలుసని కాబట్టి ఇతరులపై బాడీ షేమింగ్ కామెంట్లు చేసేటప్పుడు ఒకసారి మీ గురించి కూడా ఆలోచించండని స్వీట్ వార్నింగ్ ఇచ్చింది.దీంతో ఈ విషయంపై కొందరు నెటిజన్లు స్పందిస్తూ ఈ మధ్యకాలంలో కొందరు ఆకతాయిలు సినీ సెలబ్రిటీల పై అసభ్యకర కామెంట్లు చేస్తూ పాపులర్ కావాలని చూస్తున్నారని అలాంటి వారికి సానుషసరిగ్గా బుద్ధి చెప్పిందంటూ అభినందనలు తెలియజేస్తున్నారు.అంతేగాక అవగాహన లేనటువంటివాళ్ళు చేసే కామెంట్లను పట్టించుకోవద్దని అలాగే తన నటనపై దృష్టి సారించమని సానుష కి సూచిస్తున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా ఈ మధ్య సానుష బరువు తగ్గేందుకుగాను బాగానే ప్రయత్నాలు చేస్తోంది.ఇందులో భాగంగా జిమ్ లో ఎక్కువ సమయం గడుపుతూ వర్కౌట్లు చేస్తోంది.కాగా ఇటీవలే సానుష తెలుగులో స్టార్ నాని హీరోగా నటించిన జెర్సీ చిత్రంలో జర్నలిస్ట్ పాత్రలో నటించింది.కానీ అమ్మడి పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడంతో ఎవరూ గుర్తించలేదు.