ఏపీలో ప్రతిపక్ష పాత్ర పోషించడానికి టీడీపీ మరింతగా బలోపేతం అవ్వడానికి రెడీ అవుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.ఇప్పటికే ప్రభుత్వం పరీక్షల విషయంలో వ్యవహరిస్తున్న తీరుపై టిడిపి నేతలు చాలా ఘాటుగా రియాక్ట్ అవుతున్నారు.
విద్యార్థుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోంది వన్ టూ లోకేష్ అదే రీతిలో మరికొంత మంది తెలుగుదేశం పార్టీ నేతలు .టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణపై మండిపడ్డారు.
ఇదిలా ఉంటే తాజాగా టిడిపి అగ్రనాయకత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు పార్లమెంట్ స్థానాలకు 36 మంది తో కూడిన రెండు కమిటీలను ప్రకటించడం జరిగింది.ఈ కమిటీల జాబితాను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చం నాయుడు ప్రకటించారు.
ముందుగా తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి జవహర్ అధ్యక్షతన 36 మంది తో అదే రీతిలో జీవీ ఆంజనేయులు అధ్యక్షతన నరసరావుపేటకు 36 మంది తో కూడిన కమిటీలను నియమించడం జరిగింది.దాదాపు రెండు పార్లమెంటు స్థానాలకు సంబంధించి 72 పదవులు అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేసే రీతిలో పదవులను నియమించారు.