తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం లో వైసీపీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ముందే నానా హడావిడి చేశారు.పూర్తి వివరాల్లోకి వెళితే ముమ్మిడివరం గ్రామంలో స్థానిక వైసీపీ కార్యకర్తలు వీరంగం సృష్టించారు.
వైసీపీ నాయకుడు మాజీ కౌన్సిలర్ కుమారుడు దుర్గా ప్రసాద్ జన్మదిన వేడుకలు కావడంతో ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుట నిర్వహించి రచ్చ రచ్చ చేశారు.రోడ్లపై కత్తులతో ఇష్టానుసారంగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరించారు.
దీంతో వెంటనే స్థానికులు రోడ్డుపై ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న వైసీపీ కార్యకర్తల పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలియజేశారు.
ముమ్మిడివరం గ్రామంలో ఏకంగా పోలీస్ స్టేషన్ ఎదుటే ఈ రకంగా వైసీపీ కార్యకర్తలు వ్యవహరించడంతో .స్థానిక ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.వైసీపీ మాజీ కౌన్సిలర్ కుమారుడు పుట్టినరోజు అయితే.
ఏకంగా రోడ్డుపైనే అది కూడా పోలీస్ స్టేషన్ దగ్గర అంత హడావిడి చేయాలా .? అంటూ స్థానికులు మండిపడుతున్నారు.అధికారం ఉంది కదా అని ఈ రకంగా వ్యవహరించకూడదు అంటూ మరికొంతమంది తాజా ఘటన పై మండిపడుతున్నారు.కత్తులతో జన్మదిన వేడుకలు ఏంటి అంటూ మరికొంతమంది సెటైర్లు వేస్తున్నారు.
.