టాలీవుడ్ టాలెంటెడ్ హీరోల్లో విజయ్ దేవరకొండ ఒకరు.ఈయన పెళ్లి చూపులు సినిమాతో యూత్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆ తర్వాత వచ్చిన అర్జున్ రెడ్డి సినిమాతో టాప్ హీరోల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు.రోజురోజుకూ ఈయనకు యూత్ లో ఫాలోయింగ్ పెరిగిపోతుంది.
అయితే ఈయన ఎదుగుదలను చూసి కొంతమంది హీరోలు ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతున్నారని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి.
అర్జున్ రెడ్డి సినిమాతో మొదలైన క్రేజ్ రోజురోజుకూ పెరుగుతుంది.
ఇప్పుడు టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ లో కూడా మంచి ఫాలోయింగ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమాతో తన క్రేజ్ పెంచుకునే పనిలో ఉన్నాడు.
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారాలని విజయ్ భావిస్తున్నాడు.
ఈ మధ్య విజయ్ దేవరకొండకు మోస్ట్ డిజైరబుల్ మ్యాన్ టైటిల్ వరసగా మూడవసారి సాధించాడు.
మూడవసారి కూడా టైటిల్ సాధించడంతో ఆయన క్రేజ్ ఏమాత్రం ఉంటుందో అర్ధం అవుతుంది.ఇది ఇలా ఉంటే తాజాగా బాలీవుడ్ పాపులర్ సెలెబ్రిటీ ఫోటోగ్రాఫర్ డబూ రత్నాని తన క్యాలెండర్ లో విజయ్ దేవరకొండకు చోటు కల్పించడంతో మళ్ళీ ఈయన పేరు మార్మోగిపోతోంది.
డబూ రత్నాని క్యాలెండర్ లో కనిపించిన మొదటి సౌత్ ఇండియన్ స్టార్ గా విజయ్ మరొకసారి రికార్డ్ క్రియేట్ చేసాడు.ఈ ఫోటోషూట్ నుండి తాజాగా ఓ ఫోటో విడుదల చేయడంతో ఆ ఫోటో కొన్ని క్షణాల్లోనే వైరల్ అయ్యింది.ఇది బయటకు వచ్చిన కొద్దీ సమయంలోనే మరికొంతమంది హీరోలు విజయ్ కు పోటీగా ఫోటోలు వదలడంతో ఇప్పుడు ఈ విషయం పై చర్చ జరుగుతుంది.అందుకే విజయ్ ను చూసి కొంతమంది హీరోలు ఇన్ సెక్యూర్ ఫీల్ అవుతున్నారంటూ వార్తలు వస్తున్నాయి.