విక్టరీ వెంకటేష్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో నారప్ప సినిమా కంప్లీట్ చేసిన సంగతి తెలిసిందే.తమిళ్ హిట్ మూవీ అసురన్ కి రీమేక్ గా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీని దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల ఆవిష్కరించారు.
బ్రహ్మోత్సవం లాంటి డిజాస్టర్ తర్వాత ఏకంగా మూడేళ్ళకి పైగా గ్యాప్ తీసుకొని శ్రీకాంత్ అడ్డాల ఈ రీమేక్ మూవీతో తనని తాను ప్రూవ్ చేసుకోవడానికి రెడీ అవుతున్నాడు.నారప్ప హిట్ అయితే మళ్ళీ ఈ క్లాస్ దర్శకుడు ట్రాక్ లో పడే అవకాశం ఉంది.
ఏకంగా దిల్ రాజు, అలాగే గీతా ఆర్స్ల నిర్మాతలు శ్రీకాంత్ అడ్డాలపై దృష్టి పెట్టారు.నారప్ప రిజక్ట్ బట్టి ఈ రెండు బ్యానర్స్ లో శ్రీకాంత్ సినిమాలు ఉండే అవకాశం ఉంది.
ఇక నారప్ప మూవీలో ప్రియమణి వెంకటేష్ కి జోడీగా నటించింది.
ఇందులో వెంకటేష్ ఇద్దరు పిల్లల తండ్రిగా కాస్తా వయస్సు మళ్ళిన పాత్రలో కనిపించబోతున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటే ఈ మూవీ కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ కారణంగా ఒటీటీలో రిలీజ్ అవుతుందని అందరూ భావించారు.అయితే థియేటర్స్ ఓపెన్ చేసే ఛాన్స్ ఉందనే టాక్ రావడంతో పాటు, కొన్ని చోట్ల మల్టీప్లెక్స్ థియేటర్స్ ని ఓపెన్ కూడా చేశారు.
ఈ నేపధ్యంలో నారప్ప మూవీని థియేటర్ రిలీజ్ కోసం సురేష్ బాబు రెడీ చేస్తున్నారు.త్వరలో డేట్ కూడా ఫిక్స్ చేయనున్నట్లు టాక్.వీలైనంత త్వరగా ఈ మూవీని థియేటర్ లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో నిర్మాత సురేష్ బాబు ఉన్నట్లు బోగట్ట.