ఎప్పుడైతే షర్మిల తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చారో అప్పటి నుంచి ప్రత్యేక పంథాను ఎంచుకుని ముందుకు సాగుతున్నారు.ప్రతి విషయంలో కేసీఆర్పై విమర్శలు చేస్తూ వార్తల్లో నిలుస్తున్నారు.
అయితే ఆమె చేసే ప్రతి విమర్శ కూడా మంచి పాయింట్ ఉన్నవే కావడం గమనార్హం.ఇప్పటి వరకు నిరుద్యోగం, కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడం, గవర్నమెంట్ ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాల్లాంటివి ఆమె డిమాండ్లలో ప్రధానమైనవి.
అయితే ఎన్ని చెప్పినా.ఆమె మాత్రం తెలంగాణ యువతనే టార్గెట్ చేశారు.ఎందుకంటే యువత తలుచుకుంటే ఏదైనా సాధ్యమని, అలాంటి యువత తన పార్టీకి అండగా ఉండాలని ఆమె భావిస్తున్నారు.ఇందుకోసం నిరుద్యోగ సమస్యలనే తన ప్రధాన ఎజెండాగా చేసుకుని విమర్శలు చేస్తున్నారు.
అలాగే ఆయా జిల్లాల్లోని వైఎస్సార్ అభిమానులను కలుపుకుని పోతున్నారు.ఇప్పటికే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నాడు కూడా నిరుద్యోగంతో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలన పరామర్శించారు.
ఇక ఇప్పుడు కూడా వారినే టార్గెట్ చేస్తూ పర్యటన చేస్తున్నారు.ఇప్పుడు తాజాగా నల్లగొండ ఉమ్మడి జిల్లాపై ఫోకస్ పెట్టారు.
హుజూర్నగర్లో ఆత్మహత్య చేసుకున్న నీలకంఠసాయి కుటుంబాన్ని, అలాగే ఇటీవల మరణించిన వైఎస్సార్సీపీ సీనియర్ నేత నాగిరెడ్డి కుటుంబాన్ని పరామర్శించనున్నారు.అలాగే జిల్లాల్లో ఉన్న అభిమానులతో మమేకం అవుతారు.పార్టీని జిల్లాలో ఎలా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై దిశానిర్ధేశం చేస్తారు షర్మిల.కానీ షర్మిల ఇలా నిరుద్యోగులను మాత్రమే టార్గెట్ చేయడం ఎంత వరకు పార్టీని బలోపేతం చేస్తుందనేది పెద్ద ప్రశ్న.
బలమైన నాయకులు లేని ఏ పార్టీ కూడా మనుగడ కష్టం.మరి షర్మిల జులై 14న తన పార్టీ పేరును, గుర్తును ప్రకటించినున్న విషయం తెలిసిందే.తండ్రి పేరు మీదనే ఆమె తన పార్టీని పెడుతున్నారు.తండ్రి పేరుతో సానుభూతి పెంచుకోవచ్చనేది ఆమె ప్లాన్.
చూడాలి మరి ఆమె ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుందో.
తాజా వార్తలు