నీళ్లలో బతికే జీవులు చాలానే ఉన్నాయి.అయితే నీళ్లలో అతి బలంతో బతికే జీవులలో మొసలి కూడా ఉంది.
మొసలి నీల్లలో ఉన్నంత వరకూ దాని బలాన్ని చూపిస్తుంది.ఒక వేళ అది భూమిపైకి వస్తే దాని బలం మందగిస్తుంది.
సరిగ్గా అలాంటి ఘటనే ఒకటి చోటుచేసుకుంది.ఉగాండాలో ఒసామా బిన్ లాడెన్ అనే మొసలి ప్రజలను భయపెడుతోంది.
ఆ మొసలికి ఆ పేరు పెట్టారు.ఈ మొసలి 16 అడుగులు ఉండటం విశేషం.
ఈ మొసలి వయసు దాదాపుగా 75 సంవత్సరాలు ఉండనున్నట్లు తెలుస్తోంది.ఆ మొసలి ఇప్పటి వరకూ 80 మందిని పొట్టనబెట్టుకుంది.1991-2005 సంవత్సరాల మధ్య ఆ మొసలి చాలా మందిని చంపేసింది.దీంతో గ్రామ ప్రజలు, లుగాంగా గ్రామ ప్రజలు భయంతో వణికిపోతున్నారు.
చుట్టుపక్కల గ్రామాల ప్రజలు నీళ్ల కోసం నది వద్దకు వెళ్తుంటారు.ఆ సమయంలో ఆ మొసలి పిల్లలపై దాడి చేసేది.దాని వల్ల వారు ప్రాణాలను వదిలేవారు.అంతేకాకుండా చేపలు పట్టేందుకు జాలరులు నదిలో వేటను కొనసాగించేవారు.
అప్పుడు కూడా ఆ మొసలి భయంకరంగా వారిపై దాడి చేసేది.కొంత సమయంలోనే చాలా మంది చనిపోయేవారు.
బోట్లలో వెళ్తున్నప్పుడు మొసలి దాడి చేయడం వల్ల ప్రజలు ఏమీ చేయలేకపోయేవారు.
తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ప్రయత్నించేవారు.పాల్ అనేది వ్యక్తి తన తమ్ముడిని కళ్లముందే పొగొట్టుకోవడం చూసి తల్లడిల్లిపోయాడు.చాలా రోజులు అధికారులు ఆ మొసలిని అంతం చేయడానికి ప్రయత్నించారు.
దాదాపు 50 మంది ఆరు గంటలు పాటు కష్టపడి ఆ మొసలిని పట్టుకున్నారు.అయితే ఈ ప్రాంతంలో మొసళ్ల వల్ల డబ్బులు పొందేవారు కూడా ఉన్నారు.
మొసళ్లను పెంచేవారు బ్రీడింగ్, చర్మాల అమ్మకం ద్వారా వారు అధిక ధనాన్ని పొందుతున్నారు.చాలా మంది అక్కడ జీవనాధారంగా ఈ మొసళ్లపైనే ఆధారపడి ఉండటం విశేషం.