టాలీవుడ్ నటి కన్నడ బ్యూటీ ప్రియమణి.ఎన్నో సినిమాలలో నటించి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది ప్రియమణి.
అంతేకాకుండా స్టార్ హీరోల సరసన కూడా నటించింది.కెరీర్ మొదట్లో తెలుగు అమ్మాయిల కనిపించిన ఈ బ్యూటీ ప్రస్తుతం గ్లామర్ ను పరిచయం చేసింది.
ఇక తన పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.తాజాగా మళ్లీ రీ ఎంట్రీ తో బాగా బిజీ గా మారింది.
సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది.
వెండి తెరపై కాకుండా బుల్లితెర లో కూడా అడుగు పెట్టింది.
ఓ డాన్స్ షోలో జడ్జిగా చేస్తుంది ప్రియమణి.ఇటీవల ది ఫ్యామిలీ మ్యాన్ 2 లో కూడా నటించగా తన పాత్రకు మంచి సక్సెస్ అందుకుంది.
ఇక లేటు వయసులో కూడా తన అందాలతో బాగా ఆకట్టుకుంటుంది.గతంలో ప్రియమణికి కాస్త శరీర బరువు లో మార్పులు రావడంతో బొద్దుగా కనిపించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియమణి కొన్ని విషయాలు పంచుకుంది.తనకు ఎదురైన బాడీ షేమింగ్ కామెంట్స్ లను పంచుకుంది.
కొన్నేళ్ల కిందట తను బరువు పెరగడంతో ఆ సమయంలో తనపై ట్రోలింగ్స్ దారుణంగా వచ్చాయని తెలిపింది.అంతేకాకుండా తనను ఆన్ లైన్ లో ‘బ్లాక్ ఆంటీ‘ అని పిలిచేవారట.ఇక తను బరువు పెరగటం తో కూడా ఎన్నో నెగటివ్ కామెంట్స్ జరుగుతుందట.దీనివల్ల మనశ్శాంతి కోల్పోయానని మానసికంగా ఇబ్బందులు పడ్డానని తెలిపింది ప్రియమణి.
దీంతో ఆమె తెగ వర్క్ ఔట్ లు చేసి తన శరీర బరువు తగ్గించుకొని మళ్లీ గ్లామర్ గా తయారయింది.అంతేకాకుండా రీ ఎంట్రీతో బాగా బిజీగా మారింది.
ప్రస్తుతం వరుస సినిమాలలో అవకాశాలు అందుకోగా.హీరో రానా నటిస్తున్న విరాటపర్వంలో నటిస్తుంది.
అంతేకాకుండా వెంకటేష్ నటిస్తున్న నారప్ప సినిమాలో కూడా బిజీగా ఉంది.