బాలీవుడ్ సినీ నటుడు సుశాంత్ సింగ్ మరణం తర్వాత ఆయన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి పేరు ఎంత హాట్ టాపిక్ గా మారిందో అందరికీ తెలిసిందే.సుశాంత్ మరణం గురించి కేసును దర్యాప్తు చేస్తున్న సమయంలో డ్రగ్స్ కేసులో రియా చక్రవర్తి పేరు బయటపడగా ఎన్ సీ బీ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకోగా కొద్ది రోజులు జైల్లో ఉండి బయటకు వచ్చింది.
ఇదిలా ఉంటే ఆయన మరణానికి కారణం రియా చక్రవర్తి అని ఎంతోమంది అభిమానులు ఆమెపై బాగా మండిపడ్డారు.ఇదిలా ఉంటే తాజాగా సుశాంత్ పై ఎమోషనల్ కామెంట్స్ చేసింది రియా.
గత ఏడాది ఇదే సమయాన లోకాన్ని విడిచి వెళ్ళిన సుశాంత్ సింగ్ మరణించి ఏడాది అవ్వడంతో ఇండస్ట్రీకి చెందిన వాళ్లు, అభిమానులు ఆయన ఆత్మ శాంతి చేకూరాలని ప్రార్థించారు.ఇక తాజాగా రియా చక్రవర్తి తన సోషల్ మీడియా వేదికగా సుశాంత్ గురించి కొన్ని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.
సుశాంత్ తో ఉన్న ఫోటోను షేర్ చేసిన రియా చక్రవర్తి.కొన్ని విషయాలు షేర్ చేసింది.తన జీవితంలో గడిపిన ప్రతిక్షణం తను తన పక్కనే ఉన్నాడనే ఫీలింగ్ ఉందని.కాలం గడిచిన కొద్దీ తన మెమోరీస్ చెరిగిపోతాయని తెలిపింది.
గడిచిన ప్రతిరోజు తనను తలుచుకోని క్షణమే లేదని తెలిపింది.అతనే తనకు సర్వస్వం గా మారాడు అంటూ, భౌతికంగా తనకు దూరమైన.అతను మాత్రం తన వెంటే ఉన్నాడని తెలిపింది.కొన్ని సార్లు గుండె పగిలేలా చేశాడని.మొత్తానికి సుశాంత్ సాధించాడని మనసులో అనుకొని మరుసటి రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటానని తన ఎమోషనల్ ను బయటపెట్టింది.ఇక సుశాంత్ తన పక్కన లేడనే విషయం తన హృదయంలో ఎన్నో ఎమోషన్స్ ఎదురయ్యాయని.
ఈ విషయం బయట పెట్టడానికి తనలో తన తల, గుండె పగిలిపోయేలా బాధ ఉందని తెలిపింది.
సుశాంత్ లేని జీవితం తన జీవితం లేదని.
పదే పదే ఆ విషయాన్ని గుర్తుచేస్తున్నావ్ అంటూ.తమ మధ్య ఉన్న దూరాన్ని ఎవరు పూడ్చ లేరంటూ భావోద్వేగాల్ని పంచుకుంది.
ఇక తన స్వీట్ బాయ్ కోసం ఇంకా ఎదురు చూస్తున్నాను అంటూ.ప్రతిరోజు తనకు మాల్పువా ఇస్తానని ప్రామిస్ చేశానని.
భౌతిక శాస్త్రానికి చెందిన అన్ని సూత్రాలు చదివానని అందుకైనా నువ్వు తిరిగి రావాలి అంటూ నా ప్రేమను మిస్సయ్యాను అనే బాధలో ఉన్నానని.నా కోసం తిరిగి రావాలి అంటూ తన ఎమోషనల్ తో అందరి హృదయాలను తాకింది రియా చక్రవర్తి.