ఏపీలో ఇప్పుడు వైసీపీ దూకుడుకు బ్రేకులు వేయడం టీడీపీకి సాధ్యం కావట్లేదు.అయితే దీనిపై చంద్రబాబు నాయుడు అన్ని పార్టీలను కలుపుకుని వెళ్తేనే సాధ్యమని గమనించి ఆ మేరకు ప్లాన్ వేస్తున్నారు.తనకు పాత మిత్రపార్టీ అయిన బీజేపీతో కలిసేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు.2014లో బీజేపీతో కలిసి పోటీ చేసిన టీడీపీ.ఆ తర్వాత దూరమైంది.2019లో ఒంటరిగానే బరిలోకి దిగింది.చంద్రబాబు మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడంతో బీజేపీ నేతలు ఆగ్రహం మీదున్నారు.
అయితే చంద్రబాబు మాత్రం ఇప్పుడు ఎలాగైనా బీజేపీతో కలిసేందుకు నానా ప్రయత్నాలు చేస్తున్నారు.
మొన్న జరిగిన టీడీపీ మహానాడులో కూడా బీజేపీకి సపోర్టు చేస్తున్నట్టు ప్రకటించారు.అయినా బీజేపీ మాత్రం కలిసేది లేదని తెగేసి చెప్తున్నారు.
ఇదే విషయంపై రీసెంట్ గా జరిగిన బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ మీటింగ్ లో కేంద్ర మంత్రి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మురళీధరణ్, బీజేపీ జాతీయ కార్యదర్శి అయిన పురంధేశ్వరి కూడా ఇదే విషయంపై తేల్చి చెప్పారు.
తాము ఎట్టి పరిస్థితుల్లో టీడీపీతో కలిసేది లేదని తేల్చి చెప్పారు.కేవలం జనసేనతోనే ఉంటామని స్పష్టం చేశారు.వైసీపీని ధీటుగా ఎదుర్కొంటామని, అంతేగానీ చంద్రబాబు, టీడీపీని చేర్చుకునేది లేదని తెగేసి చెప్పారు.
అయితే చంద్రబాబు మాత్రం దీనిపై సానుకూలంగానే ఉంటున్నారు.ఎలాగైనా బీజేపీని మళ్లీ కలుపుకుంటేనే తమ పార్టీకి భవిష్యత్ ఉంటుందని అనుకుంటున్నారు.
ఇంకోవైపు జగన్ కూడా కేంద్ర కేబినెట్లో చేరుతారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.రాజ్యసభలో బలం పెంచుకునేందుకు వైసీపీని ఎన్డీయేలో చేర్చుకోవాలని కేంద్ర పెద్దలు భావిస్తున్నారు.
అయితే చంద్రబాబుకు మాత్రం బీజేపీతో దోస్తీ చేయాలని మరో ప్లాన్ వేసేందుకు రెడీ అవుతున్నారు.మరి రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఉండరు కాబట్టి రేపు ఓకే చెప్పినా చెప్పొచ్చు.