సాధారణంగా చాలా మంది తమ పళ్ళు తెల్లగా లేవని, మిళమిళ మెరవడం లేదని తెగ చింతిస్తుంటారు.ఆహారపు అలవాట్లు, నోటి శుభ్రత లేకపోవడం, బ్యాక్టీరియా, స్మోకింగ్, మధ్యపానం, షుగర్ పానియాలు అధికంగా తీసుకోవడం ఇలా రకరకాల కారణాల వల్ల దంతాలు తెలుపును కోల్పోతాయి.
దాంతో రకరకాల పేస్ట్లు మారుస్తూ పళ్ళును మళ్లీ తెల్లగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తుంటారు.అయితే టూత్ పేస్ట్లతో కాకుండా.
న్యాచురల్ టిప్స్ పాటిస్తూ కూడా దంతాలను మెరిపించుకోవచ్చు.అందుకు దానిమ్మ తొక్కలు అద్భుతంగా సహాయపడతాయి.
మరి దానిమ్మ తొక్కలను ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా దానిమ్మ తొక్కలను ఎండబెట్టుకోవాలి.
ఇప్పుడు ప్టౌవ్పై ప్యాన్ పెట్టి అందులో ఎండబెట్టుకున్న దానిమ్మ తొక్కలు వేసి డ్రై రోస్ట్ చేయాలి.ఆ తర్వాత ఈ తొక్కలను పొడి చేసుకోవాలి.
ఇప్పుడు పళ్ళను ఈ దానిమ్మ తొక్కల పొడితో బాగా తోముకుని.ఆ తర్వాత నోటిని శుభ్రం చేసుకోవాలి.
ఇలా చేస్తే దంతాలు తెల్లగా వస్తాయి.
అయితే కొందరి దంతాలు అంత త్వరగా తెల్లగా మారవు.
అలాంటి వారు ఒక బౌల్లో దానిమ్మ తొక్కల పొడి వేసి అందులో నిమ్మ రసం యాడ్ చేసి మిక్స్ చేయాలి.ఇప్పుడు ఈ మిశ్రమాన్ని దంతాలకు బాగా రుద్ది.అనంతరం గోరు వెచ్చని నీటితో నోటిని క్లీన్ చేసుకోవాలి.ఇలా ప్రతి రోజు చేస్తే.దంతాలు తళ తళా మెరుస్తాయి.
అలాగే ఒక బౌల్తో ఒక స్పూన్ దానిమ్మ తొక్కల పొడి వేసి అందులో పావు స్పూన్ సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి.
ఇప్పుడు ఈ పొడిని పళ్ళకు రుద్ది.అనంతరం నీటితో క్లీన్ చేసుకోవాలి.
ఇలా చేసినా కూడా దంతాలకు పట్టిన గార వదిలి.తెల్లగా, అందంగా మెరుస్తాయి.