బుల్లితెరలో ఓ రేంజ్ లో దూసుకుపోతున్న సీరియల్ కార్తీకదీపం.ఈ సీరియల్ ప్రస్తుతం సామాన్యులనే కాకుండా సెలబ్రిటీల మనసులను కూడా దోచేసింది.
అంతేకాకుండా రేటింగ్ విషయంలో అన్ని సీరియల్స్ కంటే పై స్థానంలో ఉంది.ప్రస్తుతం ఈ సీరియల్ మరింత ఆసక్తిగా మారటంతో అభిమానులు ఈ సీరియల్ ను చూడటానికి రెప్పపాటు సమయాన్ని కూడా వదలట్లేదు.
ఎక్కడ చూసినా ఈ సీరియల్ గురించే మాట్లాడుతున్నారు అభిమానులు.
ప్రస్తుతం ఈ సీరియల్ లో దీప అమ్మ తనం గురించి నిజం తెలుసుకున్నా కార్తీక్ దీపకు క్షమాపణలు తెలుపుతాడు.
దీంతో అభిమానులు ఆ సీన్ ను చూసి తెగ సంబర పడిపోయి ఇక ఈ సీరియల్ శుభం పలుకుతుందని అనుకున్నారు.కానీ మరో క్షణం లోనే కథ మొత్తం రివర్స్ తిరిగింది.
మోనిత వచ్చి కార్తీక్ వల్ల ప్రెగ్నెంట్ అని చెప్పే సరికి మళ్ళీ కథ మొదటికి వచ్చింది.దీంతో అభిమానులు మొత్తం ఆశలు వదులుకున్నారు.
సోషల్ మీడియాలో కూడా తెగ కామెంట్స్ చేస్తున్నారు.ఇక దీప, కార్తీక్ లు ఈ జన్మకు కలవరని ఫిక్స్ అయ్యారు.చాలా వరకు ఇదంతా మోనిత చేస్తున్న ప్లాన్ అనుకొని కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు.నిజానికి కార్తీక్ తప్పు లేదని.కావాలనే కార్తీక్ ని లొంగదీసుకుందని అంటున్నారు.తాజాగా సినీ నటుడు వెన్నెల కిషోర్ కూడా ఈ సీరియల్ గురించి ఓ కామెంట్ చేశాడు.
ఎంత పని చేసావు డాక్టర్ బాబు అంటూ బ్రహ్మానందం స్టైల్ లో ఓ మీమ్ ను కార్తీక్ (నిరుపమ్)కు షేర్ చేశాడు.దీనిని నిరుపమ్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా అభిమానులతో పంచుకున్నాడు.గతంలో కూడా వెన్నెల కిషోర్ మరో కామెంట్ చేయగా.అంతా మంచి డాక్టర్ బాబు కి అంత మంచి వంటలక్క అంటే ఎందుకంత కోపం అని కామెంట్ చేసిన సంగతి తెలిసిందే.