టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ముందు నుండి చేసుకున్న ప్లానింగ్స్ అన్ని కరోనా కారణంగా ఆవిరి అయిపోయాయి.తాజాగా కరోనా సెకండ్ వేవ్ తగ్గుముఖం పడుతుండడంతో ఇక ఒక్కొక్కరు షూటింగ్ స్టార్ట్ చేస్తున్నారు.
తాజాగా ప్రభాస్ కూడా తన సినిమాలను ఎలా కంప్లీట్ చెయ్యాలో ప్లాన్ రెడీ చేసుకుని పక్కాగా దానిని ఫాలో అవ్వాలని డిసైడ్ అయ్యాడట.
మొదటిగా ప్రభాస్ రాధేశ్యామ్ సినిమాను పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట.
ఈ సినిమా దాదాపు చివరి దశకు చేరుకుంది.దీంతో ఈ జూన్ నెలాఖరులో ప్రభాస్ రాధేశ్యామ్ షూట్ లో పాల్గొని కంప్లీట్ చేయబోతున్నాడట.
దీని తర్వాత ప్రభాస్ కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కేసలార్ సినిమా షూటింగ్ మొదలు పెట్టె ఆలోచనలో ఉన్నాడట.
ఈ సినిమా షూటింగ్ ను జులై మధ్యలో మొదలు పెట్టి తొందరగా కంప్లీట్ చెయ్యాలని చూస్తున్నాడట.ఈ సినిమాను ఉగ్రం సినిమాకు రీమేక్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాలో హీరోయిన్ గా శృతి హాసన్ నటిస్తుంది.
ఆ తర్వాత ప్రభాస్ ఆదిపురుష్సినిమాలో జాయిన్ అవ్వబోతున్నారు.ఈ సినిమాకు బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ సినిమాకు ప్రభాస్ సెప్టెంబర్ నెలలో డేట్స్ ఇచ్చాడట.ఆదిపురుష్ సినిమా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతుంది.ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా, సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తున్నారు.ఈ సినిమాను విజువల్ వండర్ గా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.మొత్తానికి ప్రభాస్ ఈ సంవత్సరం చివరి నాటికి తాను ఒప్పుకున్నా ప్రాజెక్ట్స్ అన్ని పూర్తి చేయబోతున్నాడన్నమాట.
ఏదైతేనేమి తన ప్లానింగ్ సూపర్ అనే చెప్పాలి.