టాలీవుడ్ లో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోల్లో నితిన్ ఒకరు.నితిన్ గత సంవత్సరం విడుదలైన భీష్మ సినిమాతో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
ఈ సినిమా తర్వాత చెక్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.ఇది అన్ని సినిమాల్లా కాకుండా కాస్త డిఫెరెంట్ గా ఉంటుంది.
ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేక పోయింది.చంద్రశేఖర్ యేలేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కింది.
ఈ సినిమా డిజాస్టర్ తర్వాత నితిన్ రంగ్ దే సినిమా రిలీజ్ చేసాడు.ఈ సినిమాను వెంకీ అట్లూరి దర్శకత్వం వహించారు.రొమాంటిక్ కామెడీ లవ్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.ఇందులో నితిన్ కు జోడీగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.
ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అదే జోష్ లో నితిన్ నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసాడు.
ఈ సినిమా నితిన్ మేర్లపాక గాంధీ దర్శకత్వంలో చేస్తున్నాడు.ఈ సినిమాకు మాస్ట్రో అనే టైటిల్ కూడా అనౌన్స్ చేసారు.ఈ సినిమాలో నభా నటేష్ హీరోయిన్ గా నటిస్తుంటే.
తమన్నా కీలక పాత్రలో కనిపిస్తుంది. బాలీవుడ్ లో హిట్ అయిన అంధాదున్ సినిమాకు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది.
షూటింగ్ చివరి దశలో ఉండగా ఈ సినిమా షూటింగ్ కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.
అయితే తాజాగా ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ చేసాడు నితిన్.తాజాగా ఈ రోజు ఫైనల్ షెడ్యూల్ ను సోమవారం హైదరాబాద్ లో ప్రారంభం చేసారు.కరోనా తర్వాత సినిమా షూటింగ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ హీరో నితిన్ ఏ కావడం విశేషం.
ఈ షెడ్యూల్ లో నితిన్, తమన్నా పై కీలక సన్నివేశాలు తెరక్కించబోతున్నారని తెలుస్తుంది.ఈ సినిమాను రాజ్ కుమార్ సమర్పణలో శ్రేష్ఠ మూవీస్ బ్యానర్ పై ఎన్ సుధాకర్ రెడ్డి, నిఖిత రెడ్డిలు నిర్మిస్తున్నారు.