స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ అంతాఇంతా కాదు.పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ మూవీ పింక్ సినిమాకు రీమేక్ అయినా ఆ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే.
పవన్ ప్రస్తుతం అయ్యప్పనుమ్ కోషియమ్, హరిహరవీరమల్లు సినిమాలలో నటిస్తుండగా హరీష్ శంకర్ సినిమా మొదలుకాకుండానే ఈ సినిమాకు సంబంధించి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
అయితే పవన్ కళ్యాణ్ కొన్నేళ్ల క్రితమే జనసేన పార్టీని స్థాపించిన సంగతి విదితమే.
ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ పవన్ రాజకీయాల్లో సక్సెస్ కావాలని భావిస్తున్నారు.ప్రస్తుతం పవన్ నటిస్తున్న సినిమాల షూటింగ్ పూర్తి కావడానికి మరో రెండేళ్ల సమయం పట్టే అవకాశం ప్రస్తుతం నటిస్తున్న మూడు సినిమాల తర్వాత పవన్ మరో సినిమాకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తారని ఆ తర్వాత సినిమాలు చేయరని సమాచారం.
2024 ఎన్నికల ఫలితాలను బట్టి పవన్ కళ్యాణ్ సినిమాల విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఒక్కో సినిమాకు 50 కోట్ల రూపాయలకు అటూఇటుగా పారితోషికం తీసుకుంటున్నారు.సినిమాల షూటింగ్ పూర్తైన తరువాత పవన్ రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి పార్టీని యాక్టివ్ చేసుకోవాలని భావిస్తున్నారు.2019 ఎన్నికల్లో పవన్ రెండు స్థానాల్లో పోటీ చేసినా ఎన్నికల్లో విజయం సాధించలేదు.
2024 ఎన్నికల్లో మాత్రం కచ్చితంగా విజయం సాధించాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు.
పవన్ 2023 నుంచి పూర్తిగా రాజకీయాలకే పరిమితం అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని సమాచారం అందుతోంది.అయితే పవన్ ఏ విధంగా నిర్ణయాలు తీసుకుంటారో చూడాల్సి ఉంది.ప్రస్తుతం ఏపీలో బీజేపీ జనసేన పార్టీలు కలిసి పని చేస్తున్నాయి.
బీజేపీ జనసేన కూటమి విజయం సాధిస్తే పవన్ కళ్యాణ్ సీఎం అయ్యే అవకాశం ఉంది.