బాలీవుడ్ బ్యూటీ ప్రపంచ సుందరి ప్రియాంక చోప్రా.ఒక మంచి పేరు సంపాదించుకున్న ఈ గ్లామర్ బ్యూటీ.
తన అందంతో ప్రపంచ సుందరి కిరీటాన్ని దక్కించుకుంది.అంతేకాకుండా హాలీవుడ్ లో అవకాశాలు అందుకుంటున్న ప్రియాంక.
సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది.ఇక ఆమె అమెరికా సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
సోషల్ మీడియా వేదికగా ఏదో ఒక ఫోటో తో హాట్ టాపిక్ గా మారుతుంది ప్రియాంక.
ఇక తాజాగా కొన్ని విషయాలు పంచుకున్న బ్యూటీ.
జీవితంలో కిందకు పడిపోవడం, తప్పులు చేయడం సహజమే కానీ వాటిలో లోపాలను గ్రహించి మెరుగుపరుచుకోవాలని అంటుంది.ఇక అదృష్టం, విధి అనేవి ఈ రెండు చేతిలో చేయి వేసుకుని తిరుగుతాయని తాను అనుకుంటుందట.
తనకు జరిగిన కొన్ని సంఘటనల గురించి విధిని నమ్ముతుందట.
మనం ఎక్కువగా తోటి వారి గురించి ఆలోచిస్తామని, వారి వెనుక ఉన్న వాటి గురించి ఎక్కువగా ఆలోచిస్తామని వాటిని మానుకోవాలని తెలిపింది.
ఇక జీవితం అనేది మనకు నిమ్మకాయలను ఇస్తే వాటితో మనం ద్రాక్ష రసం చేయడానికి ప్రయత్నించాలి అంటూ తెలిపింది ప్రియాంక చోప్రా.పైగా అవి దక్కిన వెంటనే నిశ్శబ్దంగా ఉండాలని తెలిపింది.
ఎందుకంటే అవి దక్కిన వాటి నుంచి అద్భుతం చేయాలని తెలిపింది.అలా చేయడం వల్ల పక్కన వాళ్ళు మన వైపు ఆలోచనలో పడతారని తెలిపింది.
ఇక ఎవరికి వారు నిజాయితీగా ఉండాలని.ప్రతి ఒక్క విషయంలో అంగీకరించు కోవాలని, ఎలాంటి పరిస్థితిలోనైనా ధైర్యాన్ని కోల్పోవద్దని తెలిపింది.అందరికీ కొన్ని విషయాలను కంట్రోల్ చేయడం సాధ్యం కాదని శక్తివంచన లేకుండా వచ్చిన అవకాశాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకోవడం మాత్రం మన చేతుల్లోనే ఉందని తెలిపింది.ఇక ఆత్మవిశ్వాసం, ప్రతిభ పై నమ్మకం ఉన్నప్పుడు ఏదైనా సాధ్యమే అంటూ ఏదీ కష్టం కాదని తెలిపింది.
ఇలా కొన్ని జీవిత సత్యాల గురించి తెలిపింది ప్రియాంక చోప్రా.