నేడు వైఎస్ జగన్ ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తో భేటీ కాబోతున్నారు.ఈరోజు సాయంత్రం 5 గంటలకు మర్యాదపూర్వకంగా రాజ్ భవన్ లో సమావేశం కానున్నారు.
ఈ భేటీలో రెండు సంవత్సరాల పరిపాలన రాష్ట్ర ప్రగతి అదే రీతిలో సంక్షేమ పథకాల అమలుపై గవర్నర్ కి జగన్ నివేదిక అందించే అవకాశం ఉంది.అదే రీతిలో పలు అంశాలపై గవర్నర్ తో ఈ సందర్భంగా జగన్ చర్చించనున్నట్లు సమాచారం.
ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టిన జగన పలు కేంద్ర మంత్రులను కలవడం జరిగింది. పోలవరం ప్రాజెక్టు పెండింగ్ నిధులు, అదే రీతిలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఇంకా అనేక విషయాలలో రాష్ట్రానికి రావాల్సిన నిధులు గురించి ఇంకా అనేక విషయాల గురించి చర్చించిన జగన్ తాజాగా ఈ రోజు గవర్నర్ తో భేటీ కావడంతో ఈ భేటీ ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.
<