టాలీవుడ్ యంగ్ హీరో ఉదయ్ కిరణ్ పరిచయం గురించి అందరికీ తెలిసిందే.ఈయన నటించిన సినిమాలలో మంచి సక్సెస్ అందుకున్న సినిమా మనసంతా నువ్వే.
ఇక ఈ సినిమాలో నటించే హీరోయిన్ రీమా సేన్.ఈ సినిమాతో తను కూడా మంచి సక్సెస్ అందుకుంది.తన నటనతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది.నటిగానే కాకుండా మోడల్ గా కూడా చేసింది.ఇక అప్పట్లోనే తనకు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది.తన అందాలతో ప్రేక్షకుల మనసులను దోచుకుంది ఈ బ్యూటీ.
చిత్రం సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన రీమా సేన్ ఆ తర్వాత పలు సినిమాలలో నటించి అతి తక్కువ సమయంలో టాలీవుడ్ లో మంచి క్రేజ్ ను అందుకుంది.ఇక తెలుగులోనే కాకుండా తమిళం, హిందీలో కూడా చాలా సినిమాలలో నటించి పలు అవార్డులు కూడా సొంతం చేసుకుంది.
ఇక ఈ బ్యూటీ 2012లో ప్రముఖ వ్యాపారవేత్త శివ్ కరణ్ సింగ్ ను పెళ్లి చేసుకుంది.అంతేకాకుండా తర్వాత ఏడాది 2013లోనే రుద్ర వీర్ కు జన్మనిచ్చింది.
పెళ్లి చేసుకున్న తర్వాత ఇది రీమా మళ్లీ సినిమాలలో అడుగు పెట్టలేదు.మొత్తం ఫ్యామిలీ తోనే గడపాలని ఫిక్స్ అయింది.సినిమాలకు దూరం అయిన ఈ బ్యూటీ అభిమానులకు సోషల్ మీడియా ద్వారా బాగా దగ్గరగా ఉంది.నిత్యం తన సోషల్ మీడియా వేదికగా తనకు సంబంధించిన విషయాలను, తన ఫ్యామిలీ ఫోటో లను అభిమానులకు బాగా షేర్ చేసుకుంటుంది.
ఇక ప్రస్తుతం తన ఫ్యామిలీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారగా అందులో తన భర్త, తన కొడుకు కూడా ఉన్నాడు.ఇక ఇప్పటికీ రీమా సేన్ అందం లో ఎలాంటి మార్పు లేదు.
అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అదే అందంతో మెరుస్తుంది.