మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయడానికి రెడీ అవుతున్న సంగతి తెలిసిందే.ఈ మూవీకి సంబందించిన ప్రీప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
ఈ సారి మహేష్ కోసం తన గత సినిమాలకి భిన్నమైన కథని త్రివిక్రమ్ ఎంచుకున్నట్లు తెలుస్తుంది.ఇక మహేష్ ఈ మూవీలో రా ఏజెంట్ గా కనిపిస్తాడని టాక్ నడుస్తుంది.
అలాగే ఫ్యామిలీ ఎలిమెంట్స్ కూడా కథలో భాగంగా ఉంటాయని సమాచారం.ఇదిలా ఉంటే ఈ మూవీలో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయంపై త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆలోచనలో పడ్డాడు.
జాన్వీ కపూర్ ని తెలుగుకి ఈ మూవీతో పరిచయం చేయాలని అనుకున్నారు.అలాగే పూజా హెగ్డే, రష్మిక మందన, కియరా అద్వానీ పేర్లు తెరపైకి వచ్చాయి.
ఇక ఈ మూవీలో ఎప్పటిలాగే మరో సీనియర్ హీరోయిన్ ని కూడా కీలక పాత్ర కోసం రంగంలోకి దించుతున్నాడు.దీంతో పాటు ఓ బాలీవుడ్ హీరోయిన్ ని మహేష్ కోసం తీసుకోస్తున్నాడు.రజినీకాంత్ కాలా మూవీలో నటించిన బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషి రీసెంట్ గా హాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటించింది.తాజాగా త్రివిక్రమ్ శ్రీనివాస్ హ్యూమాని సంప్రదించారని, ఆమె స్టొరీ లైన్ చెప్పి సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపిక చేసారని తెలుస్తుంది.
అయితే అది మహేష్ కి హీరోయిన్ గానా లేక వేరొక పాత్రనా అనేది తెలియాల్సి ఉంది.ఇదిలా ఉంటే సర్కారు వారి పాట మూవీ కంప్లీట్ చేసిన తర్వాత త్రివిక్రమ్, మహేష్ మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.