టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కు బాహుబలి సినిమాతో పోలిస్తే బాహుబలి 2 సినిమా కెరీర్ కు ప్లస్ అయింది.ఈ సినిమా ప్రభాస్ క్రేజ్ ను, ఫ్యాన్ ఫాలోవర్లను, మార్కెట్ ను, రెమ్యునరేషన్ ను పెంచింది.
బాలీవుడ్ స్టార్ హీరోలను మించి ప్రభాస్ బాహుబలి2 సినిమాతో ప్రభాస్ కు మార్కెట్ పెరిగింది.అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న సినిమాలు బాహుబలి2 కంటే ఎక్కువ బడ్జెట్ తో మరింత భారీగా తెరకెక్కుతున్నాయి.
అయితే ప్రభాస్ గురించి రాజమౌళి గతంలో ఒక సందర్భంలో చెబుతూ ప్రభాస్ పని రాక్షసుడు అని చెప్పుకొచ్చారు.ప్రస్తుతం ప్రభాస్ షూటింగ్ లను ప్లాన్ చేసుకుంటున్న తీరును చూస్తే రాజమౌళి చెప్పింది నిజమేనని కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
స్టార్ హీరో అయినప్పటికీ సింపుల్ గా ఉండే ప్రభాస్ ఈ నెలాఖరు నాటికి రాధేశ్యామ్ సినిమాకు సంబంధించిన పదిరోజుల షూటింగ్ ను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.
ఆ తరువాత సలార్ సినిమాను మొదలుపెట్టి వేగంగా పూర్తి చేయాలని ఆదిపురుష్ సినిమా షూటింగ్ లో మాత్రం సెప్టెంబర్ నుంచి పాల్గొనాలని ఫిక్స్ అయ్యారని సమాచారం.
సలార్ షూటింగ్ పూర్తైన వెంటనే ప్రభాస్ నాగ్ అశ్విన్ సినిమాను సైతం ప్రారంభించనున్నారు.ఇకపై అస్సలు బ్రేక్ తీసుకోకుండా ప్రభాస్ తన సినిమాలను పూర్తి చేయనున్నారని తెలుస్తోంది.దీంతో ప్రభాస్ నిజంగా పని రాక్షసుడేనని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
వరుస షూటింగ్ లతో బిజీ కానున్న ప్రభాస్ ఈ ఏడాది రాధేశ్యామ్ సినిమాను రిలీజ్ చేయనుండగా వచ్చే ఏడాది సలార్, ఆదిపురుష్ సినిమాలను రిలీజ్ చేయనున్నారు.రెబల్ స్టార్ వరుస సినిమాలతో బిజీగా ఉండటంతో ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.ప్రభాస్ అనుకున్న ప్రకారం ఈ సినిమాలు ఇప్పటికే ప్రకటించిన డేట్ కు రిలీజవుతాయో లేదో చూడాల్సి ఉంది.