ప్రస్తుతం టాలీవుడ్ లో మహానటి అనగానే సావిత్రి కంటే ముందు కీర్తి సురేష్ పేరే వినిపిస్తుంది.ఎందుకంటే మహానటి సినిమా తో మంచి సక్సెస్ అందుకోవడం తో పాటు ఈ సినిమాతోనే తన కెరీర్ కూడా మారిందని చెప్పవచ్చు.
ఇక టాలీవుడ్ లో వరుస ఆఫర్ లతో బాగా దూసుకుపోతుంది.స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా మారింది.
ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఈ మధ్య తన అందాన్ని పెంచుకుంది ఈ ముద్దుగుమ్మ.
ఒకప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ బాగా వర్కౌట్లు చేస్తూ ఇప్పుడు సన్నగా నాజూగ్గా తయారయింది.అంతేకాకుండా తన డ్రెస్సింగ్ స్టైల్ కూడా మొత్తం మార్చేసింది.
ప్రస్తుతం నటిస్తున్న సినిమాలలో కూడా కాస్త గ్లామర్ ను పరిచయం చేస్తుంది.సోషల్ మీడియా వేదికగా తన ఫోటోలను కూడా బాగా షేర్ చేసుకుంటుంది.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్ పై దారుణమైన కామెంట్స్ ఎదురవుతున్నాయి.
ప్రస్తుతం కరోనా కారణంగా షూటింగులు వాయిదా పడగా సెలబ్రిటీ లంతా ఇంట్లో ఉంటూ తమ ఫ్యామిలీ లతో, ఫోటో షూట్ లతో గడుపుతున్నారు.ఇక తాజాగా కీర్తి సురేష్ తన ఇన్స్టా వేదికగా ఓ ఫోటో షేర్ చేసుకోగా అందులో చూడగానే కీర్తి సురేష్ అనే అనుమానం ఎదురయింది.స్లీవ్ లెస్ మోడ్రన్ డ్రెస్ ధరించి హాట్ గా కనిపించగా సూర్యుడి తాకిడితో బాగా ఆకట్టుకుంటుంది.
ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారగా.ఇది చూసిన నెటిజనులు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు.
మరికొందరు ఈమె హీరోయినా అంటూ దారుణంగా కామెంట్స్ చేస్తున్నారు.నిజానికి కీర్తి సురేష్ సన్నబడ్డాక చాలా మంది అభిమానులు తన లుక్ నచ్చలేదని ఎన్నో కామెంట్స్ చేశారు.
ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలలో బిజీగా ఉండగా మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుంది.ఇక తమిళంలో, మలయాళంలో వరుస సినిమాలలో నటిస్తుంది.అంతేకాకుండా ఓ లేడి ఓరియెంటెడ్ సినిమాలో కూడా బిజీగా ఉంది.