ప్రధాని మోడీ కేంద్ర మంత్రుల పనితీరు పై అసంతృప్తిగా ఉన్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.ఈ నేపథ్యంలో మోడీ క్యాబినెట్ లో కొన్ని కొత్త ముఖాలు వచ్చే అవకాశాలు ఉన్నట్లు.
కొంతమందిని సాగనంపటానికి రెడీ అవుతున్నట్లు ఢిల్లీ రాజకీయాల్లో టాక్.కేంద్ర మంత్రుల పనితీరును శాఖల వారీగా రివ్యూ రిపోర్ట్ తీసుకొని మొత్తం గమనించిన తర్వాత మోడీ చాలా అసంతృప్తి వ్యక్తం చేయటం జరిగిందట.
కేంద్ర మంత్రుల పనితీరు రివ్యూ రిపోర్ట్ లను తెప్పించుకొని అమిత్ షా, జేపీ నడ్డా తో కలిసి మోడీ చర్చించడం జరిగిందట. వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ నెలలో జరిగే అవకాశం ఉండటంతో దానికి ముందే.
క్యాబినెట్ ప్రక్షాళన చేయాలని. తాజా రిపోర్ట్ ల నివేదిక ఆధారంగా ప్రధాని మోడీ డిసైడ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
వచ్చే ఏడాది ఐదు రాష్ట్రాల ఎన్నికలతో పాటు సాధారణ ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో ముందు జాగ్రత్తగా కేంద్ర క్యాబినెట్ విస్తరణ చేపట్టే దిశగా ప్రధాని మోడీ ఉన్నట్లు సమాచారం.
.