ప్రధాని మోడీ తొలిసారి జీ7 దేశాల సదస్సులో పాల్గొని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.ఈ సందర్భంగా ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కోవాలంటే ప్రపంచం మొత్తం ఏకం కావాలని మోడీ సూచించారు.”ఒక్క ప్రపంచం ఒకే ఆరోగ్యం” విధానం ప్రపంచ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రధాని మోడీ సరికొత్త నినాదాన్ని తెరపైకి తెచ్చారు.
ఇదే తరుణంలో కరోనా సెకండ్ వేవ్ వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న ఇండియా కి అండగా ఉన్న జీ7 దేశాలకు మోడీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
దేశంలో కరోనా కట్టడి చేయటానికి ఓపెన్సోర్స్ టూల్స్ ద్వారా కాంటాక్ట్ ట్రేసింగ్ కోసం, వ్యాక్సినేషన్ విధానం చాలా విజయవంతంగా పని చేసిందని పేర్కొన్నారు.ఈ క్రమంలో అమెరికా, ఆస్ట్రేలియా దేశాల పై ప్రశంసల వర్షం కురిపించారు.
మేధోసంపత్తి వాణిజ్య సంబంధిత విషయాలలో జీ7 దేశాలు ఇండియా ని సపోర్ట్ చేయాలని మోడీ ఈ సందర్భంగా కోరారు.
.