వైసిపి రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు వరుసగా నాలుగో సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కి లెటర్ రాయడం జరిగింది.మొదటిసారి వృద్ధాప్య పింఛన్లు తర్వాత సిపియస్ విధానం రద్దు ఆ తరువాత వైయస్సార్ పెళ్లి కానుక వంటి విషయాల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని జగన్ కి రఘురామకృష్ణంరాజు గతంలో లెటర్ రాయడం తెలిసిందే.
అయితే తాజాగా నాలుగోసారి రఘురామకృష్ణంరాజు ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ విడుదల చేయాలని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని జగన్ కి లెటర్ రాశారు.
గతంలో ప్రతిపక్షంలో ఉన్న సమయంలో అదేవిధంగా ఎన్నికల మేనిఫెస్టోలో ప్రతి ఏడాది జనవరి లోనే ఉద్యోగాల భర్తీ క్యాలెండర్ రెడీ చేస్తామని హామీ ఇచ్చారు.
అందువల్లే రాష్ట్రంలో నిరుద్యోగుల నుండి మద్దతు లభించిందని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఉద్యోగుల భర్తీ క్యాలెండర్ విడుదల చేస్తుందో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారు అని. క్యాలెండర్ రిలీజ్ చేయాలని రఘురామ కృష్ణంరాజు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర గ్రామ సచివాలయం, పశు సంవర్ధక శాఖ, ఉపాధ్యాయ, పోలీస్ కానిస్టేబుల్ శాఖలలో ఉన్న పోస్టులు.
భర్తీ చేయాలని. లేఖలో స్పష్టం చేశారు.
.