అగ్నిప్రమాదాలు ప్రపంచ వ్యాప్తంగా అక్కడక్కడ చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.అసలే కరోనా వల్ల చతికిల బడిన వ్యాపారులకు ఈ అగ్నిప్రమాదాలు మిగుల్చుతున్న నష్టం కోలుకోకుండా చేస్తుందట.
ఇకపోతే ఈ మధ్య కాలంలో నగరంలో ఎక్కువగా అగ్నిప్రమాదాలు సంభవిస్తున్న విషయం గమనించే ఉంటారు.ముఖ్యంగా వ్యాపార సముదాయాల్లో అర్ధరాత్రి సమయాల్లో ఈ అగ్ని ప్రమాదాలు చోటు చేసుకుంటుండటంతో ప్రాణ నష్టం జరగడం లేదు గానీ, ఆస్తి నష్టం మాత్రం సంభవిస్తుంది.
ఇకపోతే తాజాగా నగరంలోని సైఫాబాద్ నిజాం క్లబ్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుందట.కాగా ఈ మంటల దాడికి క్లబ్లోని రెండవ అంతస్తులో ఉన్న ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైందని సమాచారం.
ఇక ఈ ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్దలానికి చేరుకుని రెండు ఫైరింజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చారట.కాగా ప్రమాదం చోటు చేసుకున్న సమయం లో క్లబ్లో ఎవరు లేకపోవడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు అధికారులు.
ఇక ఈ ప్రమాదం జరగడానికి కారణాలు మాత్రం తెలియలేదు.