టాలీవుడ్ యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకరు.ఈయన కు ఇప్పటి వరకు సరైన హిట్ ఒక్కటి కూడా పడలేదు.
నటన, డాన్స్ లో అదరగొడుతున్న ఎందుకో అఖిల్ కు కలిసిరావడం లేదు.తొందరపడకుండా నిదానంగా స్టోరీలను ఎంచుకుంటూ చేస్తున్న అఖిల్ కు మాత్రం సూపర్ హిట్ అయితే దక్కడం లేదు.
ప్రస్తుతం అఖిల్ చేసిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు అఖిల్.రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు.ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్నప్పటికీ కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తుంది.
ఈ సినిమా తర్వాత అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఏజెంట్ సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.
ఇప్పటికే విడుదల అయినా పోస్టర్ లో అఖిల్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది.అఖిల్ లోని మాస్ హీరోను బయటకు తీసి ప్రేక్షకులకు కొత్తగా చూపించేందుకు సురేందర్ రెడ్డి రెడీ అవుతున్నాడు.
తాజాగా అఖిల్ సినిమా విషయంలో మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.అక్కినేని అఖిల్ మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఒక సినిమా చేయబోతున్నాడని వార్తలు వస్తున్నాయి.అది కూడా ఒక లవ్ స్టోరీ అని తెలుస్తుంది.అయితే ఇంకా ఈ సినిమాకు డైరెక్టర్ ఎవరనేది కన్ఫర్మ్ అవ్వనట్టు తెలుస్తుంది.అదే కనుక నిజమైతే త్వరలోనే ఈ సినిమాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.