సమాజంలో మనిషి మనిషిగా బ్రతుకుతూ, తనతోపాటుగా నలుగురిని బ్రతికించడం గొప్పతనం.కానీ నేటి కాలంలో స్వార్ధం మనుషుల మనసులను ఏలుతూ అడుగడుగున నాకేంటి లాభం అని ఆలోచించేలా చేస్తుందన్నది నిజం.
దీని వల్ల తోటి వారికి సహాయం చేయాలన్న అందులో స్వార్ధాన్నే చూస్తున్నాడు మనిషి.
ఇలాంటి కలికాలంలో, కర్కశులు మనుషుల రూపంలో సంచరిస్తున్న పుడమిలో ఎక్కడో ఒక్కచోట మానవత్వం వికసిస్తూనే ఉంటుందని ఒక మహిళా కానిస్టేబుల్ చేస్తున్న పని చూస్తే అర్ధం అవుతుంది.
ఆ వివరాలు చూస్తే.మహారాష్ట్ర రాజధాని ముంబైకి చెందిన పోలీస్ కానిస్టేబుల్ రెహనా షేక్ ఒక స్కూలుకు చెందిన 50 మంది నిరుపేద పిల్లలను దత్తత తీసుకుని ఉదారత చాటారు.
ఇకపోతే ఒక మహిళా కానిస్టేబుల్ 50 మంది పేద పిల్లలను దత్తత తీసుకుని, వారికి పదో తరగతి వరకు అయ్యే ఖర్చులను భరిస్తానని తెలపడం నిజంగా గ్రేట్ అంటున్నారు నెటిజన్స్.
కోట్లకు కోట్లు అక్రమంగా సంపాదిస్తూ దున్నలుగా బలుస్తున్న పిసినాసి ధనవంతులు ఇలాంటి వారి కాళ్లూ కడిగి ఆ నీరు నెత్తిన పోసుకున్నా తప్పులేదని ఈ విషయం తెలిసిన జనం అనుకుంటున్నారట.